Hyderabad: అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు
- అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను గుర్తించిన పోలీసులు.
- ఏటీఎం సిబ్బందిపై కాల్పులకు పాల్పడిన ఘటనలో నిందితులు.
- ప్రధాన నిందితులలో ఒకరు బిహార్కి చెందిన మనీష్గా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కర్ణాటకలోని బీదర్ నగరంలోని శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇక దాడి చేసిన వ్యక్తులు ఏటీఎం డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఆ దోపిడీ దొంగలు హైదరాబాద్ నగరంలోని అఫ్జల్గంజ్లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు.
Also Read: Hyderabad: షార్ట్ సర్క్యూట్ దెబ్బకి ఇద్దరు మృతి
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
ఈ నేపథ్యంలో అప్జల్గంజ్ ప్రాంతంలో పోలీసులను చూసిన దొంగల ముఠా.. అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరిపారు. ఆపై రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపి, అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అయితే అక్కడి నుంచి ఎటు వెళ్లారన్న విషయాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సంఘటనకు సంబంధించి నిందితులను గుర్తించినట్లుగా సమాచారం అందింది.
Also Read: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరు బిహార్కి చెందిన మనీష్గా గుర్తించబడ్డాడు. మనీష్తో కలిసి ఇతర వ్యక్తులు కూడా దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నిందితులు వారం క్రితం నుండి వివిధ ప్రాంతాల్లో దోపిడీలను నిర్వహించినట్లు సమాచారం. వీటిలో కొన్ని ఛత్తీస్గఢ్, బీదర్ ప్రాంతాలలోనూ దోపిడీలు జరిగాయి. గతంలో కూడా మనీష్పై హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అతనిపై బిహార్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం, మనీష్పై వేటకు కృషి చేస్తున్న పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, బిహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మనీష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!