Mangampet Incident: ఓ తండ్రి తీర్పు.. మంగంపేట హత్య కేసులో మరో ట్విస్ట్
- అన్నమయ్య జిల్లాలో ఓ తండ్రి తీర్పు
- కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసిన తండ్రి
- పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే హత్య చేశానని వెల్లడి
- కువైట్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల
- లొంగిపోవడానికి ఇండియా వచ్చిన నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangampet Incident: కూతురి జోలికొస్తే తన కత్తే సమాధానం చెబుతుందని ఓ తండ్రి ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతే కాకుండా పోలీసుల చేతకానితనం వల్లే తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందని అంటున్నాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగపేటలో నిద్రిస్తున్న 59 ఏళ్ల వ్యక్తి రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కువైట్ నుంచి ఓ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ హత్య చేసింది తానేనని.. హత్యకు గురైన ఆంజనేయులు బంధువు ఆంజనేయ ప్రసాద్ ఈ వీడియోలో చెప్పాడు. నా కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య చేసి మళ్లీ కువైట్ వెళ్లిపోయానని చెప్పాడు.
Read Also: Shocking Incident: బైక్ కొనివ్వలేదని తాళాలు మింగిన యువకుడు.. చివరకు..
Also Read
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
అసలేం జరిగిందంటే.. ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ.. మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా, పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని తనలో తాను ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ తరువాత వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఇక, వికలాంగుడి హత్యపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం తమకు న్యాయం జరగకనే హత్య చేశానని ఆ వీడియోలో పేర్కొనడం కలకలం రేపుతోంది.
Read Also: Ola Showroom: వింత ఘటన.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసిన కస్టమర్
ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల ఎదుట లొంగిపోవడానికి కువైట్ నుంచి ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియాకు వచ్చారు. కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆంజనేయులును హత్య చేసిన కేసులో నిందితుడు ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియా వచ్చినట్లు తెలిసింది. నిన్న ఉదయం 6:30కు ఇండియాకు వస్తున్నట్లు ఫ్లైట్ టికెట్లను నిందితుడు పోలీసులకు పంపాడు. అయితే మంగళవారమే ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య ఇండియాకు చేరుకున్నట్లు తెలిసింది. ఆంజనేయ ప్రసాద్ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్లో పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. స్టేషన్కు వచ్చి లొంగిపోతానని ప్రకటించి రెండు రోజులు అవుతున్నా ఇంతవరకు ఆంజనేయ ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. రెండు రోజులు అవుతున్నా ఆంజనేయ ప్రసాద్ దంపతులు జాడ లభించకపోవడంతో అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే భార్యాభర్తలం ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
తాజావార్తలు
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!