Patan Cheru : వామ్మో.. ఒక్క ఇంట్లో 120ఓట్లా.. ఎన్నికల అధికారులే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patan Cheru : దేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. ఈ సారి ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. పార్టీలన్నీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ అధికారులకు అన్ని స్థాయిల్లో శిక్షణ ఇచ్చే చర్యలు, ఓటరు జాబితా పర్యవేక్షణ వంటి అంశాలపై దృష్టి సారించి ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలతో ఎన్నికల కసరత్తు మొదలైంది.
Read Also: IT Layoffs: గ్రాండ్గా పార్టీ ఇచ్చారు… చేసింది చాల్లే పొమ్మన్నారు.. ఉద్యోగులకు ఐటీ కంపెనీ షాక్..
Also Read
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగుస్తుంది. దీంతో 2013 డిసెంబర్ నెలాఖరుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీనికి రెండు నెలల ముందే షెడ్యూల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందుగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులు భావించారు. అలాగే ఓటరు జాబితాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అత్యధికంగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరులో 2018 వరకు 181 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఈ పోలింగ్ బూత్ లలో బోగస్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. శుక్రవారం ఒకే ఇంట్లో 120 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒకే ఇంట్లో 120 ఓట్లు ఉండడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. బోగస్ ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని పటాన్ చెరు తహసీల్దార్ పరమేష్ వెల్లడించారు. బోగస్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల నాటికి పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Read Also: Spiritual : శుభకార్యాలు చేసే టైంలో తుమ్మితే ఏమవుతుందో మీకు తెలుసా..?
తాజావార్తలు
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ట్రెండింగ్
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!