Madhya Pradesh polls: బుద్నీ నుంచే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ..
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఈ ప్రకటన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఎన్నికల నుంచి మినహాయించారనే ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలకు తెరతీసినట్లు అయింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 2018 ఎన్నికల్లో గెలిచిన దాతియా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో ఇతర బీజేపీ నేతలు ప్రధుమన్ తోమర్, గోవింద్ రాజ్పుత్, ప్రభురామ్ చౌదరి, హర్దీప్ సింగ్ డాంగ్, బిసాహులాల్ సింగ్ ఉన్నారు. వీరే కాకుండా విశ్వాస్ సారంగ్, రామేశ్వర్ శర్మ, కృష్ణ గౌర్, విష్ణు ఖత్రి వంటి వారి నియోజకవర్గాల నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చారు. మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన వెంటనే బీజేపీ తన కొత్త అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి.
Also Read
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
Also Read: Rajasthan Assembly Polls: బీజేపీ తొలి జాబితా విడుదల.. మాజీ సీఎం విధేయులకు దక్కని చోటు!
ఎన్నికల తేదీలపై వ్యాఖ్యానిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. “బీజేపీ మధ్యప్రదేశ్ ప్రజల నుంచి నిరంతరం ప్రేమను పొందుతోంది. మరోసారి అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలని, రాష్ట్ర ఓటర్లకు ఈ విషయం తెలుసు. కమలం ద్వారానే మధ్యప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, కాబట్టి ఈసారి దీపావళి కమలంతోనే ఉంటుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పార్టీగా ఉంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని పునరాగమనం చేసినప్పుడు మినహా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే, 2020 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో