Madhya Pradesh polls: బుద్నీ నుంచే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఈ ప్రకటన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఎన్నికల నుంచి మినహాయించారనే ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలకు తెరతీసినట్లు అయింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 2018 ఎన్నికల్లో గెలిచిన దాతియా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో ఇతర బీజేపీ నేతలు ప్రధుమన్ తోమర్, గోవింద్ రాజ్పుత్, ప్రభురామ్ చౌదరి, హర్దీప్ సింగ్ డాంగ్, బిసాహులాల్ సింగ్ ఉన్నారు. వీరే కాకుండా విశ్వాస్ సారంగ్, రామేశ్వర్ శర్మ, కృష్ణ గౌర్, విష్ణు ఖత్రి వంటి వారి నియోజకవర్గాల నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చారు. మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన వెంటనే బీజేపీ తన కొత్త అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి.
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
Also Read: Rajasthan Assembly Polls: బీజేపీ తొలి జాబితా విడుదల.. మాజీ సీఎం విధేయులకు దక్కని చోటు!
ఎన్నికల తేదీలపై వ్యాఖ్యానిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. “బీజేపీ మధ్యప్రదేశ్ ప్రజల నుంచి నిరంతరం ప్రేమను పొందుతోంది. మరోసారి అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలని, రాష్ట్ర ఓటర్లకు ఈ విషయం తెలుసు. కమలం ద్వారానే మధ్యప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, కాబట్టి ఈసారి దీపావళి కమలంతోనే ఉంటుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పార్టీగా ఉంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని పునరాగమనం చేసినప్పుడు మినహా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే, 2020 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!