Madhya Pradesh polls: బుద్నీ నుంచే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఈ ప్రకటన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఎన్నికల నుంచి మినహాయించారనే ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలకు తెరతీసినట్లు అయింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 2018 ఎన్నికల్లో గెలిచిన దాతియా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో ఇతర బీజేపీ నేతలు ప్రధుమన్ తోమర్, గోవింద్ రాజ్పుత్, ప్రభురామ్ చౌదరి, హర్దీప్ సింగ్ డాంగ్, బిసాహులాల్ సింగ్ ఉన్నారు. వీరే కాకుండా విశ్వాస్ సారంగ్, రామేశ్వర్ శర్మ, కృష్ణ గౌర్, విష్ణు ఖత్రి వంటి వారి నియోజకవర్గాల నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చారు. మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన వెంటనే బీజేపీ తన కొత్త అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Also Read: Rajasthan Assembly Polls: బీజేపీ తొలి జాబితా విడుదల.. మాజీ సీఎం విధేయులకు దక్కని చోటు!
ఎన్నికల తేదీలపై వ్యాఖ్యానిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. “బీజేపీ మధ్యప్రదేశ్ ప్రజల నుంచి నిరంతరం ప్రేమను పొందుతోంది. మరోసారి అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలని, రాష్ట్ర ఓటర్లకు ఈ విషయం తెలుసు. కమలం ద్వారానే మధ్యప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, కాబట్టి ఈసారి దీపావళి కమలంతోనే ఉంటుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పార్టీగా ఉంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని పునరాగమనం చేసినప్పుడు మినహా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే, 2020 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!