Madhya Pradesh polls: బుద్నీ నుంచే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఈ ప్రకటన శివరాజ్ సింగ్ చౌహాన్ను ఎన్నికల నుంచి మినహాయించారనే ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలకు తెరతీసినట్లు అయింది. రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 2018 ఎన్నికల్లో గెలిచిన దాతియా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఈ జాబితాలో ఇతర బీజేపీ నేతలు ప్రధుమన్ తోమర్, గోవింద్ రాజ్పుత్, ప్రభురామ్ చౌదరి, హర్దీప్ సింగ్ డాంగ్, బిసాహులాల్ సింగ్ ఉన్నారు. వీరే కాకుండా విశ్వాస్ సారంగ్, రామేశ్వర్ శర్మ, కృష్ణ గౌర్, విష్ణు ఖత్రి వంటి వారి నియోజకవర్గాల నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చారు. మధ్యప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన వెంటనే బీజేపీ తన కొత్త అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలో జరుగుతాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి.
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
Also Read: Rajasthan Assembly Polls: బీజేపీ తొలి జాబితా విడుదల.. మాజీ సీఎం విధేయులకు దక్కని చోటు!
ఎన్నికల తేదీలపై వ్యాఖ్యానిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. “బీజేపీ మధ్యప్రదేశ్ ప్రజల నుంచి నిరంతరం ప్రేమను పొందుతోంది. మరోసారి అభివృద్ధి వేగాన్ని కొనసాగించాలని, రాష్ట్ర ఓటర్లకు ఈ విషయం తెలుసు. కమలం ద్వారానే మధ్యప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, కాబట్టి ఈసారి దీపావళి కమలంతోనే ఉంటుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పార్టీగా ఉంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని పునరాగమనం చేసినప్పుడు మినహా గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే, 2020 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!