Bangladesh-India: షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు.. బంగ్లాదేశ్కు అప్పగించాలి.
- బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు
- షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉంది- తౌహీద్ హుస్సేన్
- షేక్ హసీనా విషయంలో భారత్.. బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య..
- ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది- మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోని ఢిల్లీలో ఉందని. . హోం మంత్రిత్వ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఏదైనా అభ్యర్థన వస్తే, షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు పంపమని తాము భారత ప్రభుత్వాన్ని కోరవలసి ఉంటుందని పేర్కొన్నారు.
Bandla Ganesh: ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి!
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
మరోవైపు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీఎన్పీ (BNP) అధికారంలోకి వచ్చిన తర్వాత, అవామీ లీగ్ ప్రభుత్వం వివాదాస్పద అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తుందన్నారు. దీని వల్ల బంగ్లాదేశ్ ప్రజలకు నష్టం జరుగుతోందని బీఎన్పీ జనరల్ సెక్రటరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్తో బలమైన సంబంధాల కోసం అలంగీర్ ఆకాంక్షించారు. గత విభేదాలను మరిచిపోయి సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ భద్రతకు ముప్పు కలిగించే వాటిని అనుమతించబోమని ఆలంగీర్ స్పష్టం చేశారు. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ అంతర్గత విషయమని.. హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు తప్పని ఆయన తెలిపారు. షేక్ హసీనాను భారత్ ఒప్పించకపోతే ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోతాయని మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అభిప్రాయపడ్డారు. “షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు తీసుకురావడానికి భారతదేశం ఏర్పాట్లు చేయాలి. ఇదే జరిగితే బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలు గౌరవించబడతాయి’’ అని అలంగీర్ అన్నారు.
Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
షేక్ హసీనాపై 2 కొత్త హత్య కేసులు నమోదయ్యాయి
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఇద్దరు బీఎన్పీ కార్యకర్తలతో సహా ముగ్గురు వ్యక్తులను చంపినందుకు సంబంధించి మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఢాకా కోర్టులో ఈ కేసులు దాఖలయ్యాయి. కాగా.. బంగ్లాదేశ్ లో హింస చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేసి ఆగస్టు 5న దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి షేక్ హసీనాపై హత్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసులతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 84కి చేరింది.
తాజావార్తలు
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!