Bangladesh-India: షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు.. బంగ్లాదేశ్కు అప్పగించాలి.
- బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు
- షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉంది- తౌహీద్ హుస్సేన్
- షేక్ హసీనా విషయంలో భారత్.. బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య..
- ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది- మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోని ఢిల్లీలో ఉందని. . హోం మంత్రిత్వ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఏదైనా అభ్యర్థన వస్తే, షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు పంపమని తాము భారత ప్రభుత్వాన్ని కోరవలసి ఉంటుందని పేర్కొన్నారు.
Bandla Ganesh: ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి!
Also Read
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరోవైపు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీఎన్పీ (BNP) అధికారంలోకి వచ్చిన తర్వాత, అవామీ లీగ్ ప్రభుత్వం వివాదాస్పద అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తుందన్నారు. దీని వల్ల బంగ్లాదేశ్ ప్రజలకు నష్టం జరుగుతోందని బీఎన్పీ జనరల్ సెక్రటరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్తో బలమైన సంబంధాల కోసం అలంగీర్ ఆకాంక్షించారు. గత విభేదాలను మరిచిపోయి సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ భద్రతకు ముప్పు కలిగించే వాటిని అనుమతించబోమని ఆలంగీర్ స్పష్టం చేశారు. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ అంతర్గత విషయమని.. హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు తప్పని ఆయన తెలిపారు. షేక్ హసీనాను భారత్ ఒప్పించకపోతే ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోతాయని మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అభిప్రాయపడ్డారు. “షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు తీసుకురావడానికి భారతదేశం ఏర్పాట్లు చేయాలి. ఇదే జరిగితే బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలు గౌరవించబడతాయి’’ అని అలంగీర్ అన్నారు.
Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
షేక్ హసీనాపై 2 కొత్త హత్య కేసులు నమోదయ్యాయి
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఇద్దరు బీఎన్పీ కార్యకర్తలతో సహా ముగ్గురు వ్యక్తులను చంపినందుకు సంబంధించి మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఢాకా కోర్టులో ఈ కేసులు దాఖలయ్యాయి. కాగా.. బంగ్లాదేశ్ లో హింస చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేసి ఆగస్టు 5న దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి షేక్ హసీనాపై హత్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసులతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 84కి చేరింది.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!