Kerala: కేరళలో తొలి కల్లుగీతా మహిళా కార్మికురాలిగా షీజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని మరోసారి నిరుపించింది కేరళ కి చెందిన షీజా. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు సాహసానికి ఒడిగట్టింది. పదుల అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ కష్ట తరంగా మారింది. కల్లుగీతను వృత్తిగా ఎంచుకుంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది.
READ MORE: Stormy Daniels: కోర్టు ముందు ట్రంప్తో రిలేషన్షిప్ గురించి చెప్పిన అడల్డ్ స్టార్
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
కేరళలో మొట్టమొదటి కల్లుగీత మహిళా కార్మికురాలిగా ఈమె నిలిచింది. షీజా, జయకుమార్లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కార్పెంటరుగా పనిచేసే జయకుమార్ 2019లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు పని చేయలేకపోవడంతో కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. షీజా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగింది. కుటుంబ బాధ్యతను స్వీకరించిన షీజా వివిధ సామాజిక సంస్థలు, క్లబ్బుల నుంచి పలు అవార్డులను అందుకొంది. వ్యవసాయం కూడా చేస్తున్న ఈమె అన్నీ తానై భర్తను, పిల్లలను పోషించుకుంటోంది. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే మానసిక ధైర్యం కోల్పోతున్న నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. షీజా స్త్రీ జాతి గర్వించేలా చేసిందని పలువురు మెచ్చుకుంటున్నారు. ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!