Sharad Pawar: NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోగ్యం సోమవారం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే ఆయనను బారామతి నుంచి పూణేకు తీసుకెళ్లి రూబీ హాల్ క్లినిక్లో చేర్చారు. పవార్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదమూడవ రోజు కార్యక్రమానికి సోమవారం బారామతి తాలూకాలోని కథేవాడిలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి శరద్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
READ ALSO: Hydra Demolition : నార్సింగిలో హైడ్రా కూల్చివేతలు
రూబీ ఆసుపత్రిలో చేరిన పవార్..
అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ను పుణేలోని రూబీ ఆసుపత్రిలో చేర్చారు. శరద్ పవార్ వెంట ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సులే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పూణేలోని రూబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. శరద్ పవార్ నిరంతర దగ్గు, కఫంతో బాధపడుతున్నారని, దీని వలన ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోందని పవార్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి గత కొన్ని రోజులుగా శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. అనారోగ్యం కారణంగా, ఆయన గత రెండు, మూడు నెలలుగా అన్ని బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో తిరిగి సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన అలసిపోయి, అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
READ ALSO: Assam CM Controversy: అస్సాం సీఎంపై హైదరాబాద్లో కేసు.. రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ!