Shahid Afridi: “భారత్ దెబ్బకు వణికిపోయాం”.. పాత గాయాన్ని గుర్తు చేసుకున్న పాక్ దిగ్గజం అఫ్రిది
Shahid Afridi: టీమిండియా క్రికెట్లో హిస్టరీలు క్రియేట్ చేస్తోంది. తన రికార్డులు తానే బద్దలుగొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఏకంగా మూడు టీ20 వరల్డ్ కప్పులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు కడుపు మంట ఎక్కువైంది. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అంశంపై ఓ మీడియాలో మాట్లాడాడు. టీమిండియా గ్రాండ్ విక్టరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాత జ్ఞాపకాలు సైతం గుర్తు చేసుకున్నాడు. గతంలో పంజాబ్ రాష్ట్రం మొహాలీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టీమ్ వణికిపోయిందని తన అనుభవాలను వివరించాడు. “2011 సెమీఫైనల్ మొహాలీ స్టేడియంలో జరిగింది. మేము ఛేజింగ్ను చాలా బాగా మొదలుపెట్టాం. మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వికెట్ పడకుండా 90 పరుగులు చేశారు. కెప్టెన్గా నేను చాలా రిలాక్స్గా కూర్చు్న్నా. ఈసారి కచ్చితంగా గెలుస్తామనుకున్నా. కానీ, మొదటి వికెట్ పడగానే పరిస్థితి తలకిందులైంది. అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకుల కేకలు, ఆ ఉత్సాహం టీమ్ ఇండియాలో కొత్త ఊపిరి పోశాయి. దీంతో మా టీమ్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. స్టేడియంలో ఆ శబ్దానికి, భారత జట్టు పోరాట పటిమకు నా జట్టులోని కొందరు బ్యాటర్లు క్రీజులో వణికిపోయారు. ప్రతి బంతికి వారు ఇబ్బంది పడ్డారు. ఆ హోరులో మా జట్టు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.” అని నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.
READ MORE: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
Also Read
ఇక 2011 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా మొహాలీలో జరిగిన భారత్-పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్థాన్పై 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 85 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో సచిన్కు నాలుగు సార్లు లైఫ్ వచ్చింది. పాక్ ఫీల్డర్లు ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఈ ఫీల్డింగ్ చూస్తే అర్థమవుతోంది. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు.. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌట్ అయింది.
READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!