Shabbir Ali: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులారా కలిసి మాట్లాడుకుందాం రండి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం సర్ జేఎసీ చైర్మన్ గా ఉంటేనే తెలంగాణ వచ్చింది అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉండడమే తప్ప ప్రజలని కలిసి కష్టాలను తెలుసుకునే అలవాటు లేదు అని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రోజు 3, 4 వందల మందిని కలిసి వారి సమస్యలని తెలుసుకున్నాడు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Read Also: AP BJP: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇలా స్పందించిన ఏపీ బీజేపీ
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో తెలంగాణ ద్రోహులు ఉన్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. 1969లో మొదటి సారిగా తెలంగాణ రావాలని ఆత్మబలిదానం చేసుకున్న గడ్డ కామారెడ్డి అని ఆయన చెప్పారు. కామారెడ్డికి వచ్చి ముఖ్యమంత్రి కేసిఆర్ చేసింది ఏమీ లేదు.. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామ ప్రజలు ఆయనను ఛీఛీ అంటున్నారు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారం అయినది తప్ప.. తెలంగాణ మాత్రం బంగారు తెలంగాణ కాలేదు అంటూ విమర్శించారు.
Read Also: Alia Bhatt : సినిమాలకు బ్రేక్ తీసుకున్న అలియా.. రోజూ ఏం చేస్తుందో చూశారా?
అందరం ఐక్యతతో పోరాడి సీఎం కేసిఆర్ ని గద్దే దించాలి అని షబ్బీర్ అలీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ఏ ఒక్క కార్మికులు కూడా రోడ్డేక్కి ధర్నాలు చేయలేదు అని ఆయన తెలిపారు. కేసిఆర్ కామారెడ్డికి వచ్చెది భూములని అమ్మడానికే.. కేటిఆర్ నర్మాల డ్యాం దగ్గర 400 ఎకరాలని కబ్జా చేశాడు.. తెలంగాణని రక్షించుకోవాడం కోసం ప్రతి ఒక్కరం చేతులు కలిపి పోరాడుదామన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అమెరికాలో బాత్ రూంలని కడిగినాడు అని ఆయన విమర్శించారు. గోదావరి జలాలని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కేసిఆర్ ని బోంద పెట్టడం ఖాయం అని షబ్బీర్ అలీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!