Shabbir Ali : రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద నుంచి గత నెల 28 నుండి ఈ రోజు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల చివరి వరకు 500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తాం షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 100కు పైగా హామీలను నెరవేర్చకుండా, బుద్ది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించిన ఆయన, గడువులోపు అమలు చేయకపోతే అప్పడు అడగండి అంటూ బీఆరెస్ కు హితవుపలికారు. రాష్ట్రంలో గడీలపాలన అంతమైంది.. ప్రజా పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారం కోల్పోయామని దొరలకు నిద్రపట్టడం లేదు.. ఆ ప్రస్టేషన్ లో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని బీఆరెస్ ను విమర్శించారు.
Also Read
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?