Bomb Threats: అసలేం జరుగుతోంది.. 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర.
- 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్లైన్స్కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇకపోతే గత 6 రోజుల్లో, దాదాపు 70 విమానాలకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. దీని కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చాలా విమానాలు దారి మళ్లించబడ్డాయి. మరికొన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ఇక తాజా సమాచారం మేరకు దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు కేసుల్లో ఇప్పటి వరకు ముంబై పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిరంతరంగా పెరుగుతున్న దృష్ట్యా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే, అన్ని ప్రోటోకాల్లను అనుసరించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు.
RBI Internship 2025: కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తున్న ఆర్బీఐ.. రూ.20,000 స్టైపెండ్ కూడా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ విమానాల రూట్ మార్చడం వల్ల కంపెనీలు ప్రతి గంటకు రూ.13 నుండి 17 లక్షల వరకు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో ఇది 5 రెట్లు ఎక్కువగా ఉంది. బెదిరింపులకు గురైన 70 విమానాలను దేశీయ విమానాలుగా అనుకుంటే.. కంపెనీలకు దాదాపు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. విమానాల తనిఖీ, ప్రయాణికులు, సిబ్బందికి వసతి, కనెక్టింగ్ ఫ్లైట్లు, ఇంధనం వంటి ఖర్చులను దీనికి జోడిస్తే ఈ సంఖ్య రూ.50 నుండి 80 కోట్లకు చేరుతుంది.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!