Bomb Threats: అసలేం జరుగుతోంది.. 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర.
- 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్లైన్స్కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇకపోతే గత 6 రోజుల్లో, దాదాపు 70 విమానాలకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. దీని కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చాలా విమానాలు దారి మళ్లించబడ్డాయి. మరికొన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక తాజా సమాచారం మేరకు దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు కేసుల్లో ఇప్పటి వరకు ముంబై పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిరంతరంగా పెరుగుతున్న దృష్ట్యా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే, అన్ని ప్రోటోకాల్లను అనుసరించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు.
RBI Internship 2025: కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తున్న ఆర్బీఐ.. రూ.20,000 స్టైపెండ్ కూడా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ విమానాల రూట్ మార్చడం వల్ల కంపెనీలు ప్రతి గంటకు రూ.13 నుండి 17 లక్షల వరకు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో ఇది 5 రెట్లు ఎక్కువగా ఉంది. బెదిరింపులకు గురైన 70 విమానాలను దేశీయ విమానాలుగా అనుకుంటే.. కంపెనీలకు దాదాపు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. విమానాల తనిఖీ, ప్రయాణికులు, సిబ్బందికి వసతి, కనెక్టింగ్ ఫ్లైట్లు, ఇంధనం వంటి ఖర్చులను దీనికి జోడిస్తే ఈ సంఖ్య రూ.50 నుండి 80 కోట్లకు చేరుతుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!