Bomb Threats: అసలేం జరుగుతోంది.. 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర.
- 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్లైన్స్కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇకపోతే గత 6 రోజుల్లో, దాదాపు 70 విమానాలకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. దీని కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చాలా విమానాలు దారి మళ్లించబడ్డాయి. మరికొన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఇక తాజా సమాచారం మేరకు దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు కేసుల్లో ఇప్పటి వరకు ముంబై పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిరంతరంగా పెరుగుతున్న దృష్ట్యా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే, అన్ని ప్రోటోకాల్లను అనుసరించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు.
RBI Internship 2025: కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందిస్తున్న ఆర్బీఐ.. రూ.20,000 స్టైపెండ్ కూడా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ విమానాల రూట్ మార్చడం వల్ల కంపెనీలు ప్రతి గంటకు రూ.13 నుండి 17 లక్షల వరకు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో ఇది 5 రెట్లు ఎక్కువగా ఉంది. బెదిరింపులకు గురైన 70 విమానాలను దేశీయ విమానాలుగా అనుకుంటే.. కంపెనీలకు దాదాపు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. విమానాల తనిఖీ, ప్రయాణికులు, సిబ్బందికి వసతి, కనెక్టింగ్ ఫ్లైట్లు, ఇంధనం వంటి ఖర్చులను దీనికి జోడిస్తే ఈ సంఖ్య రూ.50 నుండి 80 కోట్లకు చేరుతుంది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!