ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు ప్రణీత్రావు పేర్కొన్నారు. జడ్జిలు రాజకీయ నేతలు ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యులు మీడియా పెద్దలు జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు టాప్ చేసినట్లు.. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్న ప్రణీత్రావు పేర్కొన్నారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని, ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసామని, ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్ కు పాల్పడమని ప్రణీత్రావు తెలిపారు.
అంతేకాకుండా..’రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి టాపింగ్ చేశాం. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపిక్ ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకువచ్చాము. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్ లు fix చేసాము. 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేసాము. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడి పి ఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్ లు హార్డ్ డిస్క్ లాప్టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం.
ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా నాగోల్ మూసారంబాగ్ మూసి లో పడవేస్తాను. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చాడు.