Tamilnadu : మా రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టండి.. కావాల్సినంత సబ్సిడీ ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : ఇటీవల దేశంలో సెమీకండక్టర్ అంటే చిప్ పరిశ్రమ కోసం పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా చిప్స్ విషయంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైపు నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. తాజాగా తమ రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలపై అదనపు సబ్సిడీని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విధంగా తమిళనాడులోని చిప్ల తయారీ కంపెనీలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలను పొందబోతున్నాయి.
జనవరి 7న పెట్టుబడిదారుల కార్యక్రమం TN GIM 2014 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు సెమీకండక్టర్ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2024ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపిక చేయబడిన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు, రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు 50 శాతం అదనపు ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల చిప్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వివిధ దేశీయ, విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. నేటి కాలంలో, అనేక పరిశ్రమలకు సెమీకండక్టర్లు చాలా ముఖ్యమైనవి. అది కార్ల పరిశ్రమ అయినా లేదా గృహాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ అయినా, చిప్స్ ప్రతిచోటా పెద్ద ఎత్తున అవసరమవుతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ప్లాంట్లు నెలకొల్పే ప్రాజెక్టులకు 50 శాతం అదనపు సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపికైన వారి నుంచి తమిళనాడుకు వచ్చే ప్రాజెక్టులకు ఉద్యోగుల శిక్షణ, స్టాంప్ డ్యూటీ, భూమి, విద్యుత్తుకు సంబంధించిన రాయితీలు కూడా ఇవ్వబడతాయి. ఏదైనా చిప్ లేదా ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేదా డిజైన్ కంపెనీ రాష్ట్రానికి వస్తే, తమిళనాడుకు చెందిన వారిని నియమించుకుంటే వారికి మూడేళ్ల పాటు జీతంలో 30శాతం రీయింబర్స్మెంట్ లభిస్తుంది. ఈ రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.20 వేల పరిమితిని నిర్ణయించింది.
Read Also:Kotamreddy Sridhar Reddy: పది రూపాయలు ఇచ్చి వంద లాక్కుంటున్నారు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..!
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!