Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది. ముంబాయిలోని ములుంద్లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది.
Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు ఇవే
Also Read
వివరాల ప్రకారం నిందితురాలు మనాలి మెహతా తండ్రి గతేడాది చనిపోయాడు. అయితే ఆయనతో మనాలికి మంచి అనుబంధం ఉండటంతో తండ్రి చావును తట్టుకోలేకపోయింది. దీంతో తీవ్ర డిప్రెషన్ తో బాధపడేది. దాని నుంచి బయటపడటానికి ఆమె చికిత్స కూడా తీసుకుంటుంది. ఆమె ఎప్పుుడూ తన తండ్రి గురించే చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమె తల్లిగా మారి ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికైనా ఆమె మారుతుందని అందరూ అనుకున్నారు. అయితే అది జరగలేదు. కూతురు హష్వీకి తాతయ్య ఫోన్ చేస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యుల వద్ద పదే పదే చెబుతూ ఉండేది. అయితే ఉన్నట్టుండి సెప్టెంబర్ 21 తెల్లవారుజామున 4 గంటలకు 14వ అంతస్తులోని బెడ్రూమ్ కిటికీ తెరిచి చిన్నారి హష్వీని కిందకు విసిరేసింది. అప్పటికి చిన్నారి వయసు 39 రోజులు. దీంతో ఆ కుటుంబంలోని వారందరూ షాక్ కు గురయ్యారు. చిన్నారిని కాపాడదామని ప్రయత్నించగా 14వ అంతస్తు నుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి మరణించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లి మనాలి పై హత్య కేసు నమోదు చేశారు. ఆమె డిప్రెషన్ లో ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆమె మానసిక చికిత్స నేపథ్యంలో నిందితురాలిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. అయితే ఈ ఘటన మాత్రం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!