Haryana: తీవ్ర వాయు కాలుష్యం.. హర్యానాలో పాఠశాలు మూసివేత
- హర్యానాలో తీవ్ర వాయు కాలుష్యం
- 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు బంద్, కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో తీవ్రమైన ఏక్యూఐ (AQI) స్థాయిలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని సంబంధిత డిప్యూటీ కమిషనర్ అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలల మూసివేతపై జిల్లాల డిప్యూటీ కమిషనర్లు నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహిపాల్ దండా తెలిపారు.
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
Read Also: Father kills son: చదువుకోవడం లేదని కొడుకుని చంపిన తండ్రి..
హర్యానాలోని ఎనిమిది నగరాల్లో ఏక్యూఐ దారుణంగా ఉంది. భివానీ అత్యంత కలుషితంగా మారింది. భివానీతో పాటు, బహదూర్ఘర్, సోనిపట్, జింద్, రోహ్తక్, కైతాల్, కర్నాల్, గురుగ్రామ్లలో గాలి అత్యంత దారుణ స్థితి ఉంది. అలాగే.. రాష్ట్రంలోని 10 నగరాలలో AQI 200-300 మధ్య చేరుకుంది. ఈ క్రమంలో.. ఫరీదాబాద్, గురుగ్రామ్, నుహ్, రోహ్తక్, సోనిపట్, రెవారీ, ఝజ్జర్, పానిపట్, పల్వాల్, భివానీ, చర్కీ దాద్రీ, మహేంద్రగఢ్, జింద్, కర్నాల్ జిల్లాల్లో ఆంక్షలు విధించారు.
హర్యానాలోని ఎన్సిఆర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జనాలు ఇంట్లో నుండి బయటకు రావడమే కష్టంగా మారింది. గ్రేప్-4ను అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఈ క్రమంలో.. వాతావరణం ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదకరంగా భావిస్తూ.. పాఠశాలలను ప్రస్తుతానికి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!