Haryana: తీవ్ర వాయు కాలుష్యం.. హర్యానాలో పాఠశాలు మూసివేత
- హర్యానాలో తీవ్ర వాయు కాలుష్యం
- 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు బంద్, కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో తీవ్రమైన ఏక్యూఐ (AQI) స్థాయిలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని సంబంధిత డిప్యూటీ కమిషనర్ అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలల మూసివేతపై జిల్లాల డిప్యూటీ కమిషనర్లు నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహిపాల్ దండా తెలిపారు.
Also Read
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
Read Also: Father kills son: చదువుకోవడం లేదని కొడుకుని చంపిన తండ్రి..
హర్యానాలోని ఎనిమిది నగరాల్లో ఏక్యూఐ దారుణంగా ఉంది. భివానీ అత్యంత కలుషితంగా మారింది. భివానీతో పాటు, బహదూర్ఘర్, సోనిపట్, జింద్, రోహ్తక్, కైతాల్, కర్నాల్, గురుగ్రామ్లలో గాలి అత్యంత దారుణ స్థితి ఉంది. అలాగే.. రాష్ట్రంలోని 10 నగరాలలో AQI 200-300 మధ్య చేరుకుంది. ఈ క్రమంలో.. ఫరీదాబాద్, గురుగ్రామ్, నుహ్, రోహ్తక్, సోనిపట్, రెవారీ, ఝజ్జర్, పానిపట్, పల్వాల్, భివానీ, చర్కీ దాద్రీ, మహేంద్రగఢ్, జింద్, కర్నాల్ జిల్లాల్లో ఆంక్షలు విధించారు.
హర్యానాలోని ఎన్సిఆర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జనాలు ఇంట్లో నుండి బయటకు రావడమే కష్టంగా మారింది. గ్రేప్-4ను అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఈ క్రమంలో.. వాతావరణం ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదకరంగా భావిస్తూ.. పాఠశాలలను ప్రస్తుతానికి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!