Haryana: తీవ్ర వాయు కాలుష్యం.. హర్యానాలో పాఠశాలు మూసివేత
- హర్యానాలో తీవ్ర వాయు కాలుష్యం
- 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు బంద్, కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో తీవ్రమైన ఏక్యూఐ (AQI) స్థాయిలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని సంబంధిత డిప్యూటీ కమిషనర్ అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలల మూసివేతపై జిల్లాల డిప్యూటీ కమిషనర్లు నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహిపాల్ దండా తెలిపారు.
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
Read Also: Father kills son: చదువుకోవడం లేదని కొడుకుని చంపిన తండ్రి..
హర్యానాలోని ఎనిమిది నగరాల్లో ఏక్యూఐ దారుణంగా ఉంది. భివానీ అత్యంత కలుషితంగా మారింది. భివానీతో పాటు, బహదూర్ఘర్, సోనిపట్, జింద్, రోహ్తక్, కైతాల్, కర్నాల్, గురుగ్రామ్లలో గాలి అత్యంత దారుణ స్థితి ఉంది. అలాగే.. రాష్ట్రంలోని 10 నగరాలలో AQI 200-300 మధ్య చేరుకుంది. ఈ క్రమంలో.. ఫరీదాబాద్, గురుగ్రామ్, నుహ్, రోహ్తక్, సోనిపట్, రెవారీ, ఝజ్జర్, పానిపట్, పల్వాల్, భివానీ, చర్కీ దాద్రీ, మహేంద్రగఢ్, జింద్, కర్నాల్ జిల్లాల్లో ఆంక్షలు విధించారు.
హర్యానాలోని ఎన్సిఆర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జనాలు ఇంట్లో నుండి బయటకు రావడమే కష్టంగా మారింది. గ్రేప్-4ను అమలు చేస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఈ క్రమంలో.. వాతావరణం ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదకరంగా భావిస్తూ.. పాఠశాలలను ప్రస్తుతానికి మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!