Ranga Reddy : గండిపేటలో స్కూల్ బస్సు బీభత్సం.. 18 మంది విద్యార్థులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranga Reddy : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గండిపేట లో ఇందు ఇంటర్నేషనల్ స్కూల్ కి చెందిన బస్ బీభత్సం సృష్టించింది. కోకాపేట సర్కిల్ వద్ద మోటర్ సైకిల్ ను స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపినట్లు సమాచారం. ఇదే ప్రమాదంలో బస్సు లో ప్రయాణిస్తున్న 18 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
Read Also: Karepally : కారేపల్లి ఘటనపై పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
Also Read
మోటర్ సైకిల్ ను ఢీ కొట్టి కోకాపేట సర్కిల్ వద్ద ఉన్న రోటరీ లోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. వెంటనే వారిని హుటాహుటిన వేరే బస్సులలో యాజమాన్యం విద్యార్ధులను తరలించింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం గా నడపడం తోనే ప్రమాదం జరిగింది అని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు క్రేన్ సహాయం తో బస్సును పక్క కు తొలగించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో సింగరేణి అధికారులు.. రెండో రోజు పర్యటన
తాజావార్తలు
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!