SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు అపహరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి అందులోని రూ.18,41,300 నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరులోని దళితవాడ ఎదురుగా ఉన్న అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే అనంతపురం సాయినగర్ లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాన్ని తెరిచారు.
Rahul Gandhi: లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో ఏటీఎంను తెరిచారు. మిషన్ లో ఉంచిన నగదు చోరీకి గురైంది. ఈ క్రమంలో మిషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మిషన్ పై భాగం కాస్త కాలిపోయింది. అక్కడి శబ్దం విని స్థానికులు బయటకు రాగా, పలువురు వ్యక్తులు ఏటీఎం సెంటర్ నుంచి కారులో బయలుదేరి వెళ్లడం చూసారు. ఇక ఏటీఎం సెంటర్ నుంచి పొగలు రావడాన్ని గమనించారు.
Atrocity in Medchal: మేడ్చల్ లో దారుణం.. మంత్రాల పేరుతో వివాహితపై అత్యాచారం
కొంతసేపటి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసారు స్థానికులు. సీఐ శివరాముడు ఏటీఎం కేంద్రాన్ని తనిఖీ చేశారు. చోరీ జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉద్యోగులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టారు. ప్రధాన కార్యాలయం నుండి నగదు నిల్వలు, ఉపసంహరణలపై డేటా సేకరించబడింది. రూ. 18,41,300 సొమ్ము చోరీకి గురైనట్లు పోలీసులకు తెలిపారు బ్యాంకు అధికారులు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!