ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్-చిరాగ్.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్లలో మలేషియా జోడీని ఓడించారు. దీంతో సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు.
Read Also: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ఇప్పుడు బ్యాడ్మింటన్లో భారత అభిమానులకు ఇది పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకోగా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ 21-17, 21-18తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, వూయ్ యిక్ సోహ్ జోడీని ఓడించారు. ప్రపంచ ఛాంపియన్ జోడీపై సాత్విక్-చిరాగ్లకు ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో ర్యాంక్లో ఉన్న భారత జోడీ తొలిసారిగా సూపర్-1000 టోర్నీలో ఫైనల్కు చేరుకుంది. సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. సెమీ-ఫైనల్లో సాత్విక్-చిరాగ్.. కొరియా జోడీ మిన్ హ్యూక్ కాంగ్-సెయుంగ్ జే సియోను 17-21 21-19 21-18 తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్లో ప్రవేశించారు. సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ ఛాంపియన్షిప్, థామస్ కప్ మరియు కామన్వెల్త్ గేమ్స్లో పతకాలతో పాటు BWF టూర్లోని అన్ని స్థాయిలలో టైటిల్లను గెలుచుకుంది. సాత్విక్ మరియు చిరాగ్ ట్రోఫీ క్యాబినెట్లో ఒలింపిక్ పతకం మాత్రమే లేదు.
Read Also: Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
ఈ ఏడాది స్విస్ ఓపెన్ సూపర్ సిరీస్ 300 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ 2022 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సహా 3 టైటిళ్లను గెలుచుకున్నారు. వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం కూడా సాధించారు. అయితే సాత్విక్ ఇటీవలి కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఫిబ్రవరిలో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు దూరమయ్యాడు.
తాజావార్తలు
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..