Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Effect: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
Read Also: Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
నిగోహన్ రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోని రైల్వే ట్రాక్స్ ఎండలకు కరిగిపోయాయి. శనివారం ఎండ తీవత్ర ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అటుగా వస్తున్న నిలాంచల్ ఎక్స్ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.
Read Also: Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!
మరోవైపు రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలు పట్టాలు తప్పేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో గమనించిన లోకో పైలట్ వెంటనే ట్రైన్ను నిలిపేశాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కు సమాచారం అందిచాడు. దీంతో వెంటనే ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని సమస్యను గుర్తించి.. ట్రాక్ రిపేర్ చేశారు. ఆ తర్వాత లక్నో జంక్షన్ చేరుకున్న లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించగా.. రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రాక్లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. అంతేకాకుండా నిగోహన్ రైల్వే స్టేషన్లో వేరే ట్రైన్లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లిందని వివరించారు. ఈ మరోవైపు లూప్ లైన్ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్ను అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!