Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Effect: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
Read Also: Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
నిగోహన్ రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోని రైల్వే ట్రాక్స్ ఎండలకు కరిగిపోయాయి. శనివారం ఎండ తీవత్ర ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అటుగా వస్తున్న నిలాంచల్ ఎక్స్ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.
Read Also: Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!
మరోవైపు రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలు పట్టాలు తప్పేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో గమనించిన లోకో పైలట్ వెంటనే ట్రైన్ను నిలిపేశాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కు సమాచారం అందిచాడు. దీంతో వెంటనే ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని సమస్యను గుర్తించి.. ట్రాక్ రిపేర్ చేశారు. ఆ తర్వాత లక్నో జంక్షన్ చేరుకున్న లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించగా.. రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రాక్లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. అంతేకాకుండా నిగోహన్ రైల్వే స్టేషన్లో వేరే ట్రైన్లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లిందని వివరించారు. ఈ మరోవైపు లూప్ లైన్ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్ను అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!