Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Effect: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
Read Also: Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
నిగోహన్ రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోని రైల్వే ట్రాక్స్ ఎండలకు కరిగిపోయాయి. శనివారం ఎండ తీవత్ర ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అటుగా వస్తున్న నిలాంచల్ ఎక్స్ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.
Read Also: Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!
మరోవైపు రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలు పట్టాలు తప్పేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో గమనించిన లోకో పైలట్ వెంటనే ట్రైన్ను నిలిపేశాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కు సమాచారం అందిచాడు. దీంతో వెంటనే ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని సమస్యను గుర్తించి.. ట్రాక్ రిపేర్ చేశారు. ఆ తర్వాత లక్నో జంక్షన్ చేరుకున్న లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించగా.. రైల్వే డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రాక్లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. అంతేకాకుండా నిగోహన్ రైల్వే స్టేషన్లో వేరే ట్రైన్లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి వెళ్లిందని వివరించారు. ఈ మరోవైపు లూప్ లైన్ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్ను అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..