ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్-చిరాగ్.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్లలో మలేషియా జోడీని ఓడించారు. దీంతో సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు.
Read Also: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఇప్పుడు బ్యాడ్మింటన్లో భారత అభిమానులకు ఇది పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకోగా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ 21-17, 21-18తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, వూయ్ యిక్ సోహ్ జోడీని ఓడించారు. ప్రపంచ ఛాంపియన్ జోడీపై సాత్విక్-చిరాగ్లకు ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో ర్యాంక్లో ఉన్న భారత జోడీ తొలిసారిగా సూపర్-1000 టోర్నీలో ఫైనల్కు చేరుకుంది. సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. సెమీ-ఫైనల్లో సాత్విక్-చిరాగ్.. కొరియా జోడీ మిన్ హ్యూక్ కాంగ్-సెయుంగ్ జే సియోను 17-21 21-19 21-18 తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్లో ప్రవేశించారు. సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ ఛాంపియన్షిప్, థామస్ కప్ మరియు కామన్వెల్త్ గేమ్స్లో పతకాలతో పాటు BWF టూర్లోని అన్ని స్థాయిలలో టైటిల్లను గెలుచుకుంది. సాత్విక్ మరియు చిరాగ్ ట్రోఫీ క్యాబినెట్లో ఒలింపిక్ పతకం మాత్రమే లేదు.
Read Also: Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
ఈ ఏడాది స్విస్ ఓపెన్ సూపర్ సిరీస్ 300 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ 2022 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సహా 3 టైటిళ్లను గెలుచుకున్నారు. వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం కూడా సాధించారు. అయితే సాత్విక్ ఇటీవలి కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఫిబ్రవరిలో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు దూరమయ్యాడు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!