ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్-చిరాగ్.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్లలో మలేషియా జోడీని ఓడించారు. దీంతో సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు.
Read Also: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఇప్పుడు బ్యాడ్మింటన్లో భారత అభిమానులకు ఇది పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకోగా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సాత్విక్-చిరాగ్ 21-17, 21-18తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, వూయ్ యిక్ సోహ్ జోడీని ఓడించారు. ప్రపంచ ఛాంపియన్ జోడీపై సాత్విక్-చిరాగ్లకు ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో ర్యాంక్లో ఉన్న భారత జోడీ తొలిసారిగా సూపర్-1000 టోర్నీలో ఫైనల్కు చేరుకుంది. సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. సెమీ-ఫైనల్లో సాత్విక్-చిరాగ్.. కొరియా జోడీ మిన్ హ్యూక్ కాంగ్-సెయుంగ్ జే సియోను 17-21 21-19 21-18 తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్లో ప్రవేశించారు. సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ ఛాంపియన్షిప్, థామస్ కప్ మరియు కామన్వెల్త్ గేమ్స్లో పతకాలతో పాటు BWF టూర్లోని అన్ని స్థాయిలలో టైటిల్లను గెలుచుకుంది. సాత్విక్ మరియు చిరాగ్ ట్రోఫీ క్యాబినెట్లో ఒలింపిక్ పతకం మాత్రమే లేదు.
Read Also: Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
ఈ ఏడాది స్విస్ ఓపెన్ సూపర్ సిరీస్ 300 టోర్నమెంట్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ 2022 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సహా 3 టైటిళ్లను గెలుచుకున్నారు. వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం కూడా సాధించారు. అయితే సాత్విక్ ఇటీవలి కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఫిబ్రవరిలో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు దూరమయ్యాడు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!