Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్ జోడి… జూన్లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్తో హ్యాట్రిక్ సాధించారు. మెన్స్ డబుల్స్లో భారత జోడికి తొలి కొరియా ఓపెన్ టైటిల్ అందించారు. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది. వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
మొదటి సెట్లో ఓడిపోయినప్పటికీ.. రెండో సెట్ లో పుంజుకున్నారు భారత పురుషుల డబుల్స్ జోడి. ఇండోనేషియన్ జోడి రెండో సెట్ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో భారత జోడి ఆధిక్యాన్ని కొనసాగించింది. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్ని 21-14 తేడాతో గెలిచి.. కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది.
Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
అటు సెమీ ఫైనల్లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది భారత్ జోడి. అంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్లో భారత జోడిపై లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్ విజయం సాధించారు. సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఈ ఏడాది మెన్స్ డబుల్స్లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు. అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!