Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్ జోడి… జూన్లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్తో హ్యాట్రిక్ సాధించారు. మెన్స్ డబుల్స్లో భారత జోడికి తొలి కొరియా ఓపెన్ టైటిల్ అందించారు. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది. వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
మొదటి సెట్లో ఓడిపోయినప్పటికీ.. రెండో సెట్ లో పుంజుకున్నారు భారత పురుషుల డబుల్స్ జోడి. ఇండోనేషియన్ జోడి రెండో సెట్ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో భారత జోడి ఆధిక్యాన్ని కొనసాగించింది. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్ని 21-14 తేడాతో గెలిచి.. కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది.
Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
అటు సెమీ ఫైనల్లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది భారత్ జోడి. అంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్లో భారత జోడిపై లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్ విజయం సాధించారు. సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఈ ఏడాది మెన్స్ డబుల్స్లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు. అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!