Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్ జోడి… జూన్లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్తో హ్యాట్రిక్ సాధించారు. మెన్స్ డబుల్స్లో భారత జోడికి తొలి కొరియా ఓపెన్ టైటిల్ అందించారు. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది. వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
మొదటి సెట్లో ఓడిపోయినప్పటికీ.. రెండో సెట్ లో పుంజుకున్నారు భారత పురుషుల డబుల్స్ జోడి. ఇండోనేషియన్ జోడి రెండో సెట్ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో భారత జోడి ఆధిక్యాన్ని కొనసాగించింది. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్ని 21-14 తేడాతో గెలిచి.. కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది.
Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
అటు సెమీ ఫైనల్లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది భారత్ జోడి. అంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్లో భారత జోడిపై లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్ విజయం సాధించారు. సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఈ ఏడాది మెన్స్ డబుల్స్లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు. అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!