Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్సాయిరాజ్, చిరాగ్ జోడి… జూన్లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్తో హ్యాట్రిక్ సాధించారు. మెన్స్ డబుల్స్లో భారత జోడికి తొలి కొరియా ఓపెన్ టైటిల్ అందించారు. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది. వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే 'అగ్ని పరీక్ష'!
మొదటి సెట్లో ఓడిపోయినప్పటికీ.. రెండో సెట్ లో పుంజుకున్నారు భారత పురుషుల డబుల్స్ జోడి. ఇండోనేషియన్ జోడి రెండో సెట్ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో భారత జోడి ఆధిక్యాన్ని కొనసాగించింది. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్ని 21-14 తేడాతో గెలిచి.. కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది.
Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
అటు సెమీ ఫైనల్లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది భారత్ జోడి. అంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్లో భారత జోడిపై లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్ విజయం సాధించారు. సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఈ ఏడాది మెన్స్ డబుల్స్లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు. అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!