Sarfaraz Khan: 18 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ 2026 వేలానికి ఇది సరిపోతుందా…?
- సర్ఫరాజ్ ఖాన్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
- ముంబైకి జయాన్ని అందించిన జైస్వాల్–సర్ఫరాజ్ షో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపాడు ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్–B మ్యాచ్లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరకు అతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదుతూ హర్యానా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా ఎడమచేతి స్పిన్నర్ ఇషాంత్ భరద్వాజ్పై విరుచుకపడ్డాడు. గత ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సర్ఫరాజ్కు ఇది సరైన సమయంలో వచ్చిన మంచి ఇన్నింగ్స్.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
మరోవైపు ఈ మ్యాచ్లో మరో హీరోగా నిలిచాడు యశస్వి జైస్వాల్. ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ సీజన్లో రెండోసారి మాత్రమే ఆడుతున్న జైస్వాల్.. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు జైస్వాల్. అతడి ఇన్నింగ్స్ కారణంగా ముంబై కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఈ టోర్నీలో రెండో అతిపెద్ద విజయవంతమైన చేజ్గా ముంబై రికార్డులకెక్కింది.
BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్ ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో విద్వేష వ్యాఖ్యలు..
23 ఏళ్ల జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున సాధించిన తొలి సెంచరీ ఇదే. మొత్తంగా ఇది అతడి టీ20 కెరీర్లో నాలుగో శతకం. 120 ప్రొఫెషనల్ టీ20 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఎక్కువగా పవర్ హిట్టింగ్పై కాకుండా టైమింగ్, ప్లేస్మెంట్పై ఆధారపడ్డాడు. 16 ఫోర్లు, ఒక్క సిక్స్ తో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంతకుముందు జైస్వాల్ భారత జట్టు తరఫున నేపాల్పై, అలాగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు టీ20 సెంచరీలు నమోదు చేశాడు. 2024 టీ20 వరల్డ్కప్ విజేత భారత జట్టులో రిజర్వ్ ఓపెనర్గా ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంగా టీ20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కలేదు. టెస్టుల్లో స్థిరంగా ఉన్న జైస్వాల్కు ఈ ప్రదర్శన, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కూడా మళ్లీ అవకాశాలు దక్కేలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?