Sardar Vallabh Bhai Patel: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద మోడీ, ఢిల్లీలో పటేల్కు నివాళులర్పించిన అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sardar Vallabh Bhai Patel: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. నేడు ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలో ఉన్న ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూడా ఐక్యతా ప్రమాణం చేశారు. కాగా, రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా ‘రన్ ఫర్ యూనిటీ’ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా పాల్గొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో జరిగిన ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ట్విట్టర్లో “సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా, మన దేశం విధిని రూపొందించిన అతని అనిర్వచనీయమైన స్ఫూర్తిని, అసాధారణ అంకితభావాన్ని గుర్తుచేసుకున్నాము. జాతీయ ఐక్యత పట్ల ఆయన నిబద్ధత మనకు మార్గదర్శకంగా కొనసాగుతోంది. ఆయన సేవకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం.”అని పోస్ట్ చేశారు.
Read Also:Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ ఆస్ట్రేలియా.. ఓడిస్తే సెమీస్కు..!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “2014 నుండి దేశం మొత్తం ఈ రోజును ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటుంది. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ వారు ఈ దేశాన్ని ముక్కలు చేసి విడిచిపెట్టారు, ఆ సమయంలో మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 550కి పైగా సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి భారతమాత పటాన్ని రూపొందించే పని చేశారు. ..” అన్నారు. అహ్మదాబాద్లో పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ‘రన్ ఫర్ యూనిటీ’ని ప్రారంభించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పటేల్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘రన్ ఫర్ యూనిటీ’ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Read Also:Tummala Nageshwar Rao: పువ్వాడ సవాల్.. తుమ్మల సెటైరికల్ కామెంట్..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!