Tummala Nageshwar Rao: పువ్వాడ సవాల్.. తుమ్మల సెటైరికల్ కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwar Rao: ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ ను కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంచానని తెలిపారు. ఇప్పుడు ఛైర్మెన్ గా ఎవర్ని పెట్టారో మీకు తెలుసన్నారు. కొత్త బస్టాండ్ ను రేకులతో కట్టమని చెప్పలేదన్నారు. మూడు అంతస్తుల్లో బస్ స్టాండ్ కట్టాలి అనుకున్నానని తెలిపారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అటు రైల్వే ట్రాక్ పైన బైపాస్ బ్రిడ్జి ఎవరు కట్టారో ఒకసారి శిలాఫలకాల మీద పేరు చూడమనండి? అంటూ ప్రశ్నించారు. మార్కెట్ ని అభివృద్ధి చేస్తా తప్ప మార్కెట్ ని ఇక్కడ నుండి తీసుకుపోయే వాడిని కాదన్నారు. ఎన్ఎస్పి భూమి ఆక్రమించి కాలేజీ కట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మట్టిగుట్టలు మాయం చేయలేదన్నారు. ఇసుక ర్యాంప్ లు మాయం చేయలేదని, ఏ పోలీస్ కి ఫోన్ చేసి కేసులు పెట్టమని చెప్పలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎన్నో పదవులు అనుభవించారని, ఈ అనుభవంలో ఖమ్మం నగరానికి ఏం మేలు చేశారో ప్రజలకు వివరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఖమ్మం నగరంలోని ఓ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మలకు మొదటి నుంచి తమను తాము మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశం ఉందని, ఇతరులను బాగు చేయకూడదని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి కూడా తానే చేశానని మండి పడ్డారు. తన హయాంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. నగరాభివృద్ధితో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నగరానికి వచ్చాయన్నారు. చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
కొత్త కలెక్టరేట్ భవనం, ఐటీ హబ్, ప్రభుత్వ వైద్య కళాశాల, దంసాలాపురం ఆర్బీఓ, కొత్త బస్టాండ్, లకారం ట్యాంక్బండ్, మున్సిపల్ రోడ్లు, ప్రధాన ఆస్పత్రికి సంబంధించి తల్లీబిడ్డల ఆస్పత్రి, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ తదితర వాటిని ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు కొనుగోలు చేశాయి. టెండర్లు. టెండర్ల ద్వారా పనులు జరుగుతాయని కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుందన్నారు. అయితే ఈ విషయం తుమ్మలకు తెలియకపోవడం విచారకరం. తనపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే తుమ్మల ఆ పనులకు సంబంధం ఉన్నట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తుమ్మల లాంటి విలువలేని నాయకుడిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డా.భాగన్ కిషన్ రావు, డా.చైతన్య, డా.సీతారాం, డా.నవీన్, డా.అనూష, డా.ఆలూరి వంశీ పాల్గొన్నారు.
Nizamabad: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య… అదనపు కట్నం కోసమేనా?
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..