Electoral bonds: పొలిటికల్ పార్టీలకు రూ.1,368 కోట్లు ఇచ్చిన ‘లాటరీ కింగ్’ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electoral bonds: సుప్రీంకోర్టు నుండి మందలింపు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిరంగ పరిచింది. డేటా పబ్లిక్గా మారిన తర్వాత ఆ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడంలో వెనుకాడుతున్నాయి. కానీ రాజకీయ పార్టీలకు విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఎస్బీఐ బట్టబయలు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా గరిష్ట విరాళం అందించబడింది. ఈ కంపెనీని శాంటియాగో మార్టిన్ నడుపుతున్నారు. శాంటియాగోను సాధారణంగా లాటరీ కింగ్ అని పిలుస్తారు.
శాంటియాగో మార్టిన్ ఎవరు?
శాంటియాగో మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం, శాంటియాగో మార్టిన్ ప్రస్తుతం 59 సంవత్సరాలు. అతను మయన్మార్లోని యాంగాన్లో కూలీగా తన వృత్తిని ప్రారంభించాడు. 1988లో అతను భారతదేశానికి తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ముందు కర్ణాటక, కేరళలకు వ్యాపారాన్ని విస్తరించాడు. దీని తర్వాత అతను తన వ్యాపారాన్ని భూటాన్, నేపాల్కు కూడా విస్తరించాడు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Read Also:Gutha Sukender Reddy: రేవంత్ నాకు బంధువే కానీ.. అసెంబ్లీలో తప్పా ఎక్కడ కలవలేదు..!
తరువాత అతను నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, హోటళ్లతో సహా ఇతర వ్యాపారాలలో విజయం సాధించాడని వెబ్సైట్ పేర్కొంది. అతను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కూడా. ఇది భారతదేశంలో లాటరీ వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో.. విశ్వసనీయతను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్న సంస్థ. శాంటియాగో ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, స్పోర్ట్స్ బెట్టింగ్లలోకి విస్తరిస్తోంది. శాంటియాగోకు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2019 – 2024 మధ్య గరిష్టంగా రూ. 1,368 కోట్లను విరాళంగా ఇచ్చింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ED 2019 నుండి మనీలాండరింగ్ కింద కంపెనీపై దర్యాప్తు చేస్తోంది. మే 2023లో కోయంబత్తూరు, చెన్నైలలో ఈడీ దాడులు నిర్వహించింది. సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేరళలో సిక్కిం ప్రభుత్వ లాటరీని శాంటియాగో కంపెనీ విక్రయించిందని ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల సిక్కిం రూ.910 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.966 కోట్లు విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ ప్రస్తుతం అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేస్తోంది.
Read Also:Viral: ఇదేందిరయ్య.. ఎప్పుడు చూడలే.. రంపం టైర్లతో దూసుకుపోతున్న స్పోర్ట్స్ బైక్..!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!