Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Kiran Organ Donation: తమ బిడ్డ చేతికి అందివచ్చే వయసులో కన్నుమూస్తే.. పుట్టెడు దు:ఖంలో కూడా ఆ తల్లిదండ్రులు మానవత్వంతో ఆలోచించారు. తమ బిడ్డ చనిపోతూ మరో ఎనిమిది మంది రూపంలో బ్రతికి ఉండాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుడి అవయవాలను దానం చేసి, ఎనిమిది మందికి పునర్జన్మని ప్రసాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే..
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
అనుకోని ప్రమాదం.. అంతా చిన్నాభిన్నం
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ (22) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే విధి ఆ యువకుడిపై కన్నెర్ర చేసింది. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నిజాంపేట బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా ఉదయ్ కిరణ్కు ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది.
బ్రెయిన్ డెడ్ అని తేల్చిన వైద్యులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 11న ఉదయ్ కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చేతికి అందిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిస్తే.. కన్నపేగు దు:ఖం వర్ణించడం మాటలకు అంతుందా. అంతటి దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు.. ఒక మహోన్నత నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ బిడ్డ తమకు దూరం అయిన అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇస్తాడని వైద్యుల సూచన మేరకు అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో ఎనిమిది మంది మృత్యువు అంచున ఉన్న రోగులకు ఉదయ్ కిరణ్ ద్వారా కొత్త జీవితం లభించింది.
అవయవదానం అనంతరం ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని సొంత గ్రామమైన కొత్లాపూర్కు తరలించారు కుటుంబ సభ్యులు. చేతికి అందివచ్చిన కొడుకు, శవంగా ఇంటికి వస్తే ఆ కుటుంబంతో పాటు గ్రామం మొత్తం కంటతడి పెట్టుకుంటూ ఉదయ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాడని తెలిసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మరణంలోనూ మరో ఎనిమిది మందిని బ్రతికిస్తున్న ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఆ జిల్లాలో రియల్ హీరోగా నిలిచాడు.
READ ALSO: PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!