PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేసే ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. సోమవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నారీ శక్తి వందన అధినియమ్’లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
2029 గడువుపై ఏకాభిప్రాయం
2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. స్పష్టమైన గడువు లేకుండా చట్టాన్ని ఆమోదించడం సరికాదని, అందుకే 2029 నాటికి దీనిని అమలు చేయాలనే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. చట్టంలోని సాంకేతిక, రాజ్యాంగ పరమైన అంశాలపై ప్రభుత్వం నిరంతరం మేధోమథనం చేస్తోందని, నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పును పరిశీలిస్తోందని చెప్పారు.
మొదట కొత్త జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. జనాభా గణనలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్లను మరింత వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 2011 జనాభా గణన లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ల ప్రక్రియతో ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ గత నాలుగు దశాబ్దాలుగా సాగుతోందని, దీని వెనుక ఎన్నో తరాల కృషి ఉందని మోడీ అన్నారు. “మన పార్లమెంటు ఒక నూతన చరిత్రను సృష్టించేందుకు చేరువలో ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకుండా, మన పని సంస్కృతిలో భాగం కావాలి” అని ప్రధాని చెప్పారు. సమానత్వంతో కూడిన భారతదేశం అనే తీర్మానాన్ని నెరవేర్చేందుకు ఈ అడుగు అత్యంత కీలకమని ప్రధాని అభివర్ణించారు.
READ ALSO: Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!