PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేసే ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. సోమవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నారీ శక్తి వందన అధినియమ్’లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
2029 గడువుపై ఏకాభిప్రాయం
2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. స్పష్టమైన గడువు లేకుండా చట్టాన్ని ఆమోదించడం సరికాదని, అందుకే 2029 నాటికి దీనిని అమలు చేయాలనే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. చట్టంలోని సాంకేతిక, రాజ్యాంగ పరమైన అంశాలపై ప్రభుత్వం నిరంతరం మేధోమథనం చేస్తోందని, నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పును పరిశీలిస్తోందని చెప్పారు.
మొదట కొత్త జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. జనాభా గణనలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్లను మరింత వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 2011 జనాభా గణన లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ల ప్రక్రియతో ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ గత నాలుగు దశాబ్దాలుగా సాగుతోందని, దీని వెనుక ఎన్నో తరాల కృషి ఉందని మోడీ అన్నారు. “మన పార్లమెంటు ఒక నూతన చరిత్రను సృష్టించేందుకు చేరువలో ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకుండా, మన పని సంస్కృతిలో భాగం కావాలి” అని ప్రధాని చెప్పారు. సమానత్వంతో కూడిన భారతదేశం అనే తీర్మానాన్ని నెరవేర్చేందుకు ఈ అడుగు అత్యంత కీలకమని ప్రధాని అభివర్ణించారు.
READ ALSO: Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..
తాజావార్తలు
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!