PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేసే ‘నారీ శక్తి వందన అధినియమ్’ అమలు దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. సోమవారం విజ్ఞాన్ భవన్లో జరిగిన ‘నారీ శక్తి వందన అధినియమ్’లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read
- Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
2029 గడువుపై ఏకాభిప్రాయం
2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. స్పష్టమైన గడువు లేకుండా చట్టాన్ని ఆమోదించడం సరికాదని, అందుకే 2029 నాటికి దీనిని అమలు చేయాలనే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని పేర్కొన్నారు. చట్టంలోని సాంకేతిక, రాజ్యాంగ పరమైన అంశాలపై ప్రభుత్వం నిరంతరం మేధోమథనం చేస్తోందని, నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక మార్పును పరిశీలిస్తోందని చెప్పారు.
మొదట కొత్త జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. జనాభా గణనలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్లను మరింత వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 2011 జనాభా గణన లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ల ప్రక్రియతో ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే చర్చ గత నాలుగు దశాబ్దాలుగా సాగుతోందని, దీని వెనుక ఎన్నో తరాల కృషి ఉందని మోడీ అన్నారు. “మన పార్లమెంటు ఒక నూతన చరిత్రను సృష్టించేందుకు చేరువలో ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకుండా, మన పని సంస్కృతిలో భాగం కావాలి” అని ప్రధాని చెప్పారు. సమానత్వంతో కూడిన భారతదేశం అనే తీర్మానాన్ని నెరవేర్చేందుకు ఈ అడుగు అత్యంత కీలకమని ప్రధాని అభివర్ణించారు.
READ ALSO: Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..
తాజావార్తలు
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్కు జాక్పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?