Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Kiran Organ Donation: తమ బిడ్డ చేతికి అందివచ్చే వయసులో కన్నుమూస్తే.. పుట్టెడు దు:ఖంలో కూడా ఆ తల్లిదండ్రులు మానవత్వంతో ఆలోచించారు. తమ బిడ్డ చనిపోతూ మరో ఎనిమిది మంది రూపంలో బ్రతికి ఉండాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుడి అవయవాలను దానం చేసి, ఎనిమిది మందికి పునర్జన్మని ప్రసాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే..
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
అనుకోని ప్రమాదం.. అంతా చిన్నాభిన్నం
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ (22) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే విధి ఆ యువకుడిపై కన్నెర్ర చేసింది. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నిజాంపేట బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా ఉదయ్ కిరణ్కు ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది.
బ్రెయిన్ డెడ్ అని తేల్చిన వైద్యులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 11న ఉదయ్ కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చేతికి అందిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిస్తే.. కన్నపేగు దు:ఖం వర్ణించడం మాటలకు అంతుందా. అంతటి దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు.. ఒక మహోన్నత నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ బిడ్డ తమకు దూరం అయిన అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇస్తాడని వైద్యుల సూచన మేరకు అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో ఎనిమిది మంది మృత్యువు అంచున ఉన్న రోగులకు ఉదయ్ కిరణ్ ద్వారా కొత్త జీవితం లభించింది.
అవయవదానం అనంతరం ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని సొంత గ్రామమైన కొత్లాపూర్కు తరలించారు కుటుంబ సభ్యులు. చేతికి అందివచ్చిన కొడుకు, శవంగా ఇంటికి వస్తే ఆ కుటుంబంతో పాటు గ్రామం మొత్తం కంటతడి పెట్టుకుంటూ ఉదయ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాడని తెలిసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మరణంలోనూ మరో ఎనిమిది మందిని బ్రతికిస్తున్న ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఆ జిల్లాలో రియల్ హీరోగా నిలిచాడు.
READ ALSO: PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?