Sandeshkhali Case: ఎన్నికల వేళ షాకింగ్ ట్విస్ట్.. కేసు విత్డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు సందేశ్ఖాలీ ఘటన రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనతో రాష్ట్రం అట్టుడికింది. దీనికి బీజేపీ మద్దతు తెల్పడంతో మరింత ఉధృతం అయింది. హైకోర్టు ఆదేశాలతో మొత్తానికి నిందితుడు షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో
ఉంది.
ఇది కూడా చదవండి: AM Ratnam: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరు ఆపలేరు..!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
తాజాగా ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. లోక్సభ ఎన్నికల సమయంలో కీలక మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, బీజేపీ కార్యకర్తలే తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది.
ఇది కూడా చదవండి: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఇంటికి వచ్చి.. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని ఆమె తెలిపింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారని చెప్పింది. తానెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదని.. తనపై ఎలాంటి అకృత్యాలు జరగలేదని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి బీజేపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మహిళ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్ఖాలీ బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఒక బాధితురాలికి లోక్సభ సీటు కూడా ఇచ్చింది. ఎన్నికలు జరుగుతున్న వేళ సడన్గా యూటర్న్ తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Service App Hacked : 108, 102 అంబులెన్స్ సర్వీస్ యాప్ హ్యాక్.. రూ.500ఇచ్చి హాజరు వేయించుకుంటున్న ఉద్యోగులు
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!