Andhra Pradesh: రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక
- రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నిక నిర్ధారణ
- ముగ్గురూ ఎన్నికైనట్లు ప్రకటించిన ఛీఫ్ ఎలక్టోరల్ అధికారి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య ఎన్నికయ్యారు. ముగ్గురూ ఎన్నికైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అధికారికంగా ప్రకటించారు. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేయగా.. ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కాగా.. ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికైన వారికి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Read Also: Allu Arjun: చంచల్ గూడ జైలు లోపలికి అల్లు అర్జున్
Also Read
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
బీద మస్తాన్ రావు.. గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచి జంప్ చేసి 2024 రాష్ట్ర జనరల్ ఎలక్షన్ల సమయానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీద మస్తాన్ రావు ఒక వ్యాపారవేత్త.. అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. బీద మస్తాన్ రావు 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు పంపించారు… 2024లో వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. అయితే టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా రాజ్యసభకు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఆర్.కృష్ణయ్య తెలంగాణా నుంచీ వచ్చినా.. ఆయనను రాజ్యసభకు పంపించింది గత వైసీపీ ప్రభుత్వం … అయితే ఆర్.కృష్ణయ్య మొదటగా బీసీ నాయకుడు.. అలాగే రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచాడు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది.. 2024లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు. అలాగే బీజేపీ రాబోయే కాలంలో క్షేత్రస్ధాయిలో బలపడాలంటే సామాజికవర్గ సమీకరణాలను పూర్తిగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దీనిలో బీసీలలో బీజేపీని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పారు.

తాజావార్తలు
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!