టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాధతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం మూవీని త్రీడీలో తెరకెక్కించాడు. సమంత హీరోయిన్గా నటించిన ఫస్ట్ మైథాలజీ మూవీ ఇదే. కానీ ఈ ప్రయోగం సామ్కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.గత ఏడాది సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్.. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసిన తర్వాతే సమంత సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిశ్చయించుకున్నది. తాను అంగీకరించిన కొన్ని సినిమాలను వదులుకున్నది. ప్రస్తుతం సమంత పూర్తిగా రికవరీ అయినట్లు సమాచారం. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్స్ పనులతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా డబ్బింగ్ స్టూడియోలో సమంత సిటాడెల్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. హిందీ సిరీస్ రషెస్ చూశానని, చాలా బాగా వచ్చాయంటూ ఓ పోస్ట్పెట్టింది. అలాగే వరుణ్ధావన్ మరియు డైరెక్టర్స్ రాజ్డీకేలతో కలిసి దిగిన ఫోట్ను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. సమంత రీఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.సమంత గతంలో రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో సమంత నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2తోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి అడుగులోనే విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది.. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2కు మించి ఛాలెంజింగ్గా సిటాడెల్ సిరీస్లో సమంత క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం.