Samagra Kutumba Survey: 58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే.. అత్యధికంగా ఈ జిల్లాలోనే
- విజయవంతంగా సాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే
- నవంబర్ 6న ప్రారంభమైన సర్వే
- 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తి
- ఆదివారం నాటికి 58.3% సర్వే పూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది.
Read Also: Puspa 2 Trailer: ఊహించిన దానికంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు:
• గ్రామీణం: 64,41,183
• పట్టణం: 51,73,166
• మొత్తం: 1,16,14,349
బ్లాకులు:
• గ్రామీణం: 52,493
• పట్టణం: 40,408
• మొత్తం: 92,901
ఎన్యుమరేటర్లు:
• గ్రామీణం: 47,561
• పట్టణం: 40,246
• మొత్తం: 87,807
పర్యవేక్షకులు:
• గ్రామీణం: 4,947
• పట్టణం: 3,841
• మొత్తం: 8,788
జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1% ), నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది.
గ్రేటర్ హైదరాబాద్లో జోరుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే:
ఇప్పటి వరకు 9,60,656 కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది.. సర్వే విధుల్లో మొత్తం 20 వేల మంది ఎన్యుమలేటర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 28 లక్షల 28 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు లక్ష కుటుంబాల సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ.ఈ రోజు లక్ష 20 వేల కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది. ఒక్కో ఇన్యుమరేటర్ రోజుకు 10 నుండి 15 ఇళ్ల సర్వే పూర్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!