Samagra Kutumba Survey: 58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే.. అత్యధికంగా ఈ జిల్లాలోనే
- విజయవంతంగా సాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే
- నవంబర్ 6న ప్రారంభమైన సర్వే
- 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తి
- ఆదివారం నాటికి 58.3% సర్వే పూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది.
Read Also: Puspa 2 Trailer: ఊహించిన దానికంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు:
• గ్రామీణం: 64,41,183
• పట్టణం: 51,73,166
• మొత్తం: 1,16,14,349
బ్లాకులు:
• గ్రామీణం: 52,493
• పట్టణం: 40,408
• మొత్తం: 92,901
ఎన్యుమరేటర్లు:
• గ్రామీణం: 47,561
• పట్టణం: 40,246
• మొత్తం: 87,807
పర్యవేక్షకులు:
• గ్రామీణం: 4,947
• పట్టణం: 3,841
• మొత్తం: 8,788
జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1% ), నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది.
గ్రేటర్ హైదరాబాద్లో జోరుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే:
ఇప్పటి వరకు 9,60,656 కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది.. సర్వే విధుల్లో మొత్తం 20 వేల మంది ఎన్యుమలేటర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 28 లక్షల 28 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు లక్ష కుటుంబాల సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ.ఈ రోజు లక్ష 20 వేల కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది. ఒక్కో ఇన్యుమరేటర్ రోజుకు 10 నుండి 15 ఇళ్ల సర్వే పూర్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!