Salman Khan : పెరిగిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. బిగ్బాస్కు చేరుకున్న సల్మాన్!
- పెరిగిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..
- బిగ్బాస్కు చేరుకున్న సల్మాన్!
- కొత్త కారు కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజా మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పెరిగింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనను చంపుతానని నిరంతరం బెదిరిస్తున్నాడు. అతని అనుచరులు తమ తదుపరి లక్ష్యం సల్మాన్ ఖాన్ అని చెప్పారు. దీంతో నటుడు కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసాడు. దానిపై చర్చ జరుగుతోంది. సల్మాన్ కొత్త నిస్సాన్ పెట్రోల్ ఎస్యూవీని కొనుగోలు చేశాడు. ఇది బుల్లెట్ ప్రూఫ్ వాహనం.
READ MORE: Bengaluru: డేటింగ్ యాప్ పేరుతో బురిడీ.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్
Also Read
‘ఈటీమ్స్’ నివేదిక ప్రకారం.. దీని ధర రూ.2 కోట్లుగా చెబుతున్నారు. సల్మాన్ సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ఇటీవల కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బాధ్యత వహించాడు. ఈ ఘటనల నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ ఫిల్మ్ సిటీకి చేరుకున్నాడు. బిగ్ బాస్ 18 షూటింగ్ లో 60 మంది గార్డులు హై అలర్ట్లో ఉన్నాడు.
READ MORE:Abbas Naqvi: “బీజేపీ ముస్లింలకు శత్రువు కాదు.. విశ్వసించండి”.. అబ్బాస్ కీలక వ్యాఖ్యలు
సల్మాన్కి మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపు
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్కు బెదిరింపుల పరంపరను పెంచారు. అక్టోబర్ 18, శుక్రవారం ఉదయం, బిష్ణోయ్ గ్యాంగ్ ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక సందేశంలో సల్మాన్ను బెదిరించింది. అలాగే లారెన్స్ బిష్ణోయ్తో నటుడి శత్రుత్వం అంతం కావాలంటే రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యం బెదిరింపుల కారణంగా సల్మాన్ కలత చెందడమే కాకుండా, అతని కుటుంబం కూడా భయపడుతోంది. అటువంటి పరిస్థితిలో నటుడి భద్రతను పెంచడమే కాకుండా, కొత్త వాహనాన్ని కూడా చాలా బలమైన భద్రతా ఫీచర్లతో కొనుగోలు చేశారు. కాగా.. సల్మాన్ తన కొత్త కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. మరోవైపు, సల్మాన్కు బెదిరింపులు వచ్చినప్పటికీ తిరిగి షూటింగ్ మాత్రం ఆపడం లేదు. అక్టోబర్ 17న ‘బిగ్ బాస్ 18’ సెట్స్కి చేరుకున్న ఆయన శుక్రవారం ‘వీకెండ్ కా వార్’ రెండు ఎపిసోడ్లను షూట్ చేశాడు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!