Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Soumya Vishwanathan Case: 2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్లైన్స్ టుడే న్యూస్ ఛానెల్లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు. జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ను 2008లో హత్య చేసిన కేసులో నిందితులైన రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను 2009లో అరెస్టు చేసిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత సాకేత్ కోర్టు ఈరోజు దోషులుగా నిర్ధారించింది. ఈరోజు సాకేత్ కోర్టులో జర్నలిస్టు హత్య కేసులో నిందితులందరినీ అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే దోషులుగా నిర్ధారించారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(MCOCA) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అక్షయ్ కుమార్ హత్య, దోపిడీకి పాల్పడ్డారు. ఐదో నిందితుడు అజయ్ సేథీని ఇతరులకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. సౌమ్య విశ్వనాథన్ అనే 25 ఏళ్ల జర్నలిస్టు సెప్టెంబర్ 30, 2008న ఉదయం 3.30 గంటలకు పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఢిల్లీలోని వసంత్ విహార్లో హత్య చేయబడ్డారు. ఆమె కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్య వెనుక దోపిడీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో 302/34 IPC, 411 IPC, 3(1)(i), 3(2), 3(5) MCOCA సెక్షన్ల కింద నమోదైన సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు నలుగురు నిందితులపై వ్యవస్థీకృత నేరాల కింద విచారణ జరిపింది. హత్య. MCOCAలోని 411 IPC, 3(1)(i), 3(2), 3(5) సెక్షన్ల కింద మాత్రమే అజయ్ సేథి దోషిగా నిర్ధారించబడ్డారు. నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!