Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Soumya Vishwanathan Case: 2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్లైన్స్ టుడే న్యూస్ ఛానెల్లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు. జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ను 2008లో హత్య చేసిన కేసులో నిందితులైన రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను 2009లో అరెస్టు చేసిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత సాకేత్ కోర్టు ఈరోజు దోషులుగా నిర్ధారించింది. ఈరోజు సాకేత్ కోర్టులో జర్నలిస్టు హత్య కేసులో నిందితులందరినీ అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే దోషులుగా నిర్ధారించారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
Also Read
- ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(MCOCA) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అక్షయ్ కుమార్ హత్య, దోపిడీకి పాల్పడ్డారు. ఐదో నిందితుడు అజయ్ సేథీని ఇతరులకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. సౌమ్య విశ్వనాథన్ అనే 25 ఏళ్ల జర్నలిస్టు సెప్టెంబర్ 30, 2008న ఉదయం 3.30 గంటలకు పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఢిల్లీలోని వసంత్ విహార్లో హత్య చేయబడ్డారు. ఆమె కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్య వెనుక దోపిడీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో 302/34 IPC, 411 IPC, 3(1)(i), 3(2), 3(5) MCOCA సెక్షన్ల కింద నమోదైన సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు నలుగురు నిందితులపై వ్యవస్థీకృత నేరాల కింద విచారణ జరిపింది. హత్య. MCOCAలోని 411 IPC, 3(1)(i), 3(2), 3(5) సెక్షన్ల కింద మాత్రమే అజయ్ సేథి దోషిగా నిర్ధారించబడ్డారు. నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
-
ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
-
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!