Journalist Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు కీలక తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Soumya Vishwanathan Case: 2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్లైన్స్ టుడే న్యూస్ ఛానెల్లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు. జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ను 2008లో హత్య చేసిన కేసులో నిందితులైన రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను 2009లో అరెస్టు చేసిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత సాకేత్ కోర్టు ఈరోజు దోషులుగా నిర్ధారించింది. ఈరోజు సాకేత్ కోర్టులో జర్నలిస్టు హత్య కేసులో నిందితులందరినీ అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే దోషులుగా నిర్ధారించారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
Also Read
- రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(MCOCA) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అక్షయ్ కుమార్ హత్య, దోపిడీకి పాల్పడ్డారు. ఐదో నిందితుడు అజయ్ సేథీని ఇతరులకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. సౌమ్య విశ్వనాథన్ అనే 25 ఏళ్ల జర్నలిస్టు సెప్టెంబర్ 30, 2008న ఉదయం 3.30 గంటలకు పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఢిల్లీలోని వసంత్ విహార్లో హత్య చేయబడ్డారు. ఆమె కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్య వెనుక దోపిడీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో 302/34 IPC, 411 IPC, 3(1)(i), 3(2), 3(5) MCOCA సెక్షన్ల కింద నమోదైన సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో సాకేత్ కోర్టు నలుగురు నిందితులపై వ్యవస్థీకృత నేరాల కింద విచారణ జరిపింది. హత్య. MCOCAలోని 411 IPC, 3(1)(i), 3(2), 3(5) సెక్షన్ల కింద మాత్రమే అజయ్ సేథి దోషిగా నిర్ధారించబడ్డారు. నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
తాజావార్తలు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
-
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
-
Explainer: అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్..అస్త్రంగా ఇండియా! నెక్ట్స్ ఏం జరగనుంది?
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!