చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో బాబు కలల కన్న కూటమి వికటించిందన్నారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే కూటమి పార్టీ అభ్యర్థులు డిసైడ్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉనికి లేకుండా పోయిందన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారు అయ్యాయన్నారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓటమి చూడబోతుందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా చంద్ర బాబుకు పునకాలే అని, సైకిల్ రావాలి… సైకో పోవాలి ఆన్న పాటకు చంద్ర బాబు డ్యాన్స్ చేస్తున్నారన్నారు. ఎగిరే చంద్ర బాబు ను సైకో అనలా ? చంద్రబాబు వ్యవస్థల మీద ఒత్తిడి చేస్తున్నారన్నారు. అధికారంలో 2019 లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్ర బాబు తీరు ఎలా ఉందో అందరికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఏ రోజు కూడా వ్యవస్థల మీద మాట్లాడలేదని, సీఎంగా అయిన , విపక్ష నేతగా అయిన వ్యవస్థల మీద చంద్ర బాబు దాడి చేయడం పరిపాటి అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పెన్షన్ లకు డబ్బులు లేవని చంద్ర బాబు తప్పుడు ప్రచారం చేశారు. ఇవాళ 94 శాతం పెన్షన్ ల పంపిణీ పూర్తి అయ్యింది..మరి డబ్బులు ఉంటేనే కదా పంపిణీ పూర్తి అయ్యింది. చంద్ర బాబు ఒక రకమైన టెర్రరిజం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా పని చేస్తున్నారు. 30 మందికి పైగా పెన్షన్ ర్లు చనిపోయారు అని ఇప్పుడు చంద్ర బాబు ఈసీకి లేఖ రాశారు… పురంధేశ్వరి అజెండా మొత్తం చంద్ర బాబు దే.. పురంధేశ్వరి ఈసీకి ఎందుకు లేఖ రాశారు…పోలీసు అధికారుల మీద ? పురంధేశ్వరి ఎక్కడ ఉన్నా చంద్ర బాబు ఏజెంట్.. చంద్ర బాబుకు వ్యవస్థలు అంటే లెక్కలేనితనం. మేము ఎన్నడూ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎన్నికల కమిషన్ కు విచక్షణ అధికారం ఉంది. కూటమి బీసీ, ఎస్సీ, మైనార్టీ అధికారుల మీద ఈసీకి ఫిర్యాదు చేస్తుంది.. ఉద్దేశ్యం ఏంటీ..?’ అని సజ్జల వ్యాఖ్యానించారు.