Sajeeb Wazed Joy: పాకిస్థాన్కు పట్టిన గతే బంగ్లాదేశ్కు పడుతుంది..షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు
- బంగ్లాదేశ్ ఘటనపై స్పందించిన మాజీ ప్రధాని కుమారుడు
- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రస్తుతానికి భారత్లోనే ఉంటారన్న సజీబ్ వాజెద్ జాయ్
- పాకిస్థాన్ కి పట్టిన గతే బంగ్లాదేశ్ కు పడుతుందని సంచలన వ్యాఖ్య
- మరికొంత కాలం ఆమె ఢిల్లీలోనే ఉంటారని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రస్తుతానికి భారత్లోనే ఉంటారని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ చెప్పారు. ఇప్పట్లో ఇక్కడి నుంచి వెళ్లే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆయన బుధవారం డ్యుయిష్ వెల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాచారం అందించారు. “హసీనా ఆరోగ్యంగా ఉంది. నా సోదరి ఆమెతో ఉంది. కానీ మాజీ ప్రధాని చాలా బాధపడుతున్నారు. దేశం కోసం బంగాబంధువులు తమ జీవితాన్ని త్యాగం చేయడం తనను కలచివేసింది. గత ఒకటిన్నర దశాబ్దంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ, ఆమెను బయటకు విసిరేశారు.” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE: Buddhadeb Bhattacharya : బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ గా ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీంతో షేక్ హసీనా సోమవారం ఢిల్లీకి సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. భారీ భద్రతతో ఢిల్లీలోని సురక్షిత ప్రదేశానికి పంపిన విషయం తెలిసిందే.
READ MORE:Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
డ్యుయిష్ వెల్లేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మూడవ దేశం నుంచి ఆశ్రయం పొందాలనే హసీనా ప్రణాళిక గురించి జాయ్ని అడిగినప్పుడు.. “ఇవన్నీ పుకార్లు. ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొంత కాలం ఆమె ఢిల్లీలోనే ఉంటారు. నా సోదరి ఆమెతోనే ఉంది. కాబట్టి ఆమె ఒంటరిగా లేరు.” అని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా శాంతిభద్రతలను పునరుద్ధరించకుంటే పాకిస్థాన్కు పట్టిన గతే బంగ్లాదేశ్కు కూడా వస్తుందని షేక్ హసీనా కుమారుడు అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ దేశాన్ని ఎలా నడిపిస్తారో వేచి చూడాలని ఆయన అన్నారు. హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు.
READ MORE:Hyderabad Police: ప్రయాణికులకు అలర్ట్.. రాంగ్ రూట్లో వెళ్తే జైలుకే..
జాయ్ను రాజకీయాల్లోకి రావడానికి ఏమైనా ప్లాన్లు ఉన్నాయా అని అడగ్గా.. దానికి అతను నవ్వి, “ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలేవీ లేవు. మా కుటుంబంపై తిరుగుబాటు జరగడం ఇది మూడోసారి. హసీనా మినహా తన కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే చాలా కాలంగా విదేశాల్లో నివసిస్తున్నారు. షేక్ రెహానా లేదా ఇతర కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు” అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!