Hyderabad Police: ప్రయాణికులకు అలర్ట్.. రాంగ్ రూట్లో వెళ్తే జైలుకే..
- రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేస్తా..
- ప్రయాణికులకు తెలంగాణ పోలీసులు హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police: రాంగ్ రూట్ లో వాహనం నడిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పైగా.. యాక్సిడెంట్లు చేస్తే.. జైలు శిక్ష కూడా పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో రోజుకు 10 నుంచి 20 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు మరణిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్తో పాటు ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. గత ఏడాది రాంగ్ వే డ్రైవింగ్ కారణంగా 8 మంది చనిపోగా, 150 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఒకరు మృతి చెందగా, 128 మంది గాయపడ్డారు. బుధవారం నిర్వహించిన ఒకరోజు స్పెషల్ డ్రైవ్లో 688 మంది వాహనదారులు తప్పు దిశలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడగా, వారిలో 659 మంది ద్విచక్రవాహనదారులు ఉన్నారు. మిగిలిన వాటిలో 21 మూడు చక్రాల వాహనాలు, 8 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు రాంగ్ వే డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి.
Read also: IIIT Student Suicide: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
రాంగ్ డ్రైవింగ్ నిబంధనలను ఉల్లంఘించే వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం మని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించినా.. వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కొత్త చట్టాల ప్రకారం తప్పుగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. కమిషనరేట్ పరిధిలోని 124 ప్రాంతాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులను గుర్తించేందుకు ప్రత్యేక ఏఎన్ పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా అక్రమార్కులను గుర్తించి వాహనదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మోటారు వాహన చట్టంలోని 119/177, 184 సెక్షన్ల ప్రకారం రాంగ్సైడ్ డ్రైవింగ్ నేరం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 125, 281 ప్రకారం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అలాగే ప్రమాదాలకు కారణమైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. అందుకే రాంగ్ రూట్ లో వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు.
Telangana: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదా..
తాజావార్తలు
-
లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..