Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసుల అక్రమ ప్రమేయంపై దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న మార్కాపురం టూ విజయవాడ ఎపిసోడ్ ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రహస్యంగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకుని, ఎలాంటి అధికారిక రికార్డులు లేకుండా ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు ఆధారాలతో సహా నిర్ధారించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం మూడో రోజు విచారణను మరింత తీవ్రతరం చేసింది. ఇప్పటికే టాస్క్ఫోర్స్ ఏడీసీపీ (ADCP) లతాకుమారి, ఎస్ఐ నవీన్లతో పాటు పలువురు కానిస్టేబుళ్లను పిలిపించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అయితే, అసలు ఎవరి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు అంత దూరం మార్కాపురానికి వెళ్లారు? దీని వెనుక ఉన్న ఉన్నతాధికారి ఎవరు? అనే కోణంలో దర్యాప్తు అధికారులు నిశితంగా ఆరా తీస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే 24 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ సాగగా, లభించిన క్లూస్ టీమ్ నివేదికలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా మూడో రోజు విచారణను మరింత లోతుగా సాగిస్తున్నారు.
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
మరోవైపు నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాస్ను నిన్ననే దాదాపు 8 గంటల పాటు విచారించిన దర్యాప్తు బృందం, ఈ రోజు ఆయనను మరోసారి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నిస్తోంది. సాయికృష్ణపై గతంలో నమోదైన కేసులు, ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని అధికారుల పాత్రపై దైవప్రసాద్ బృందం ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణలో రోజుకో పక్కా ఆధారం దొరుకుతుండటంతో, దీనితో సంబంధం ఉన్న పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దర్యాప్తు ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులు తీవ్ర టెన్షన్లో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!