NTV Telugu Site icon

Sachin Pilot: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే..

Sachin Pailot

Sachin Pailot

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.. నిరుద్యోగం పెరిగి పోతుంది.. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు.. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని సచిన్ పైలెట్ వెల్లడించారు.

Read Also: Vishal 34 : విశాల్ 34 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..

ఎల్లుండి (నవంబర్ 30) జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేయాలి అని కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.. వారికి క్రెడిబిలిటి లేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు.. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి అని సచిన్ పైలెట్ పేర్కొన్నారు.

Read Also: Nithiin: నితిన్ కామెంట్స్ అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” గురించేనా?

రాజస్థాన్ లో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది అని సచిన్ పైలెట్ తెలిపారు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్ లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు.. ప్రజలు అర్ధం చేసుకున్నారు.. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసారు.. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్ లో ఉండదు.. అధిష్టానం ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేస్తది అంటూ సచిన్ పైలెట్ చెప్పుకొచ్చారు.