Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పాక్కు భారత్ మంత్రి
- పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం పాక్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది. సమ్మిట్ కోసం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించనుండగా.. ఆసక్తి నెలకొంది. పొరుగున ఉన్న పాకిస్థాన్లో జరగనున్న ఎస్సీఓ సమావేశంలో భారత్ పాల్గొనాలా వద్దా అనే అంశంపై చాలా కాలంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు భారత్ ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకుంది. దీనిని ధృవీకరిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఎస్సీఓ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
READ MORE: Passive Smoking: పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..? దీనికి మహిళలే ఎక్కువ బాధితులు..!
Also Read
పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. “ఈ పర్యటన బహుపాక్షిక కార్యక్రమం కోసం నిర్వహిస్తున్నారు. నేను అక్కడ భారత్-పాకిస్థాన్ సంబంధాల గురించి చర్చించడం లేదు. నేను కేవలం ఎస్సీఎస్లో సభ్యుడిగా అక్కడికి వెళ్తున్నాను. కానీ.. నేను మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాను. అది మీకు కూడా తెలుసు. అయితే ఈ కాలంలో ద్వైపాక్షిక చర్చలు ఉండవు.” అని పేర్కొన్నారు.
READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!