Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పాక్కు భారత్ మంత్రి
- పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం పాక్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది. సమ్మిట్ కోసం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించనుండగా.. ఆసక్తి నెలకొంది. పొరుగున ఉన్న పాకిస్థాన్లో జరగనున్న ఎస్సీఓ సమావేశంలో భారత్ పాల్గొనాలా వద్దా అనే అంశంపై చాలా కాలంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు భారత్ ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకుంది. దీనిని ధృవీకరిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఎస్సీఓ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
READ MORE: Passive Smoking: పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..? దీనికి మహిళలే ఎక్కువ బాధితులు..!
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. “ఈ పర్యటన బహుపాక్షిక కార్యక్రమం కోసం నిర్వహిస్తున్నారు. నేను అక్కడ భారత్-పాకిస్థాన్ సంబంధాల గురించి చర్చించడం లేదు. నేను కేవలం ఎస్సీఎస్లో సభ్యుడిగా అక్కడికి వెళ్తున్నాను. కానీ.. నేను మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాను. అది మీకు కూడా తెలుసు. అయితే ఈ కాలంలో ద్వైపాక్షిక చర్చలు ఉండవు.” అని పేర్కొన్నారు.
READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!