Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పాక్కు భారత్ మంత్రి
- పాకిస్థాన్కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం పాక్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది. సమ్మిట్ కోసం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించనుండగా.. ఆసక్తి నెలకొంది. పొరుగున ఉన్న పాకిస్థాన్లో జరగనున్న ఎస్సీఓ సమావేశంలో భారత్ పాల్గొనాలా వద్దా అనే అంశంపై చాలా కాలంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు భారత్ ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకుంది. దీనిని ధృవీకరిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఎస్సీఓ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
READ MORE: Passive Smoking: పాసివ్ స్మోకింగ్ అంటే ఏమిటి..? దీనికి మహిళలే ఎక్కువ బాధితులు..!
Also Read
పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. “ఈ పర్యటన బహుపాక్షిక కార్యక్రమం కోసం నిర్వహిస్తున్నారు. నేను అక్కడ భారత్-పాకిస్థాన్ సంబంధాల గురించి చర్చించడం లేదు. నేను కేవలం ఎస్సీఎస్లో సభ్యుడిగా అక్కడికి వెళ్తున్నాను. కానీ.. నేను మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాను. అది మీకు కూడా తెలుసు. అయితే ఈ కాలంలో ద్వైపాక్షిక చర్చలు ఉండవు.” అని పేర్కొన్నారు.
READ MORE:Game Changer : గేమ్ ఛేంజర్.. థర్డ్ సాంగ్ లెక్క వేరే?
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?