S.JaiShankar: ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోంది- ఎస్ జైశంకర్
- ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం..
- మాములు విషయం కాదు- విదేశాంగ మంత్రి జైశంకర్
- భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోంది- జైశంకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్కడ నిర్వహించిన మీడియా సంస్థ కార్యక్రమంలో మాట్లాడారు.
భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ముఖ్యంగా చాలా దేశాలు రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి ఎన్నిక కావడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. 7-8 శాతం వృద్ధి రేటును సాధించడంలో ఇతర దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నందున.. మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే ఉందని జైశంకర్ తెలిపారు. చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయని.. దేశంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
Also Read
ట్రంప్ విజయంపై..
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంపై జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరికా ఎన్నికల్లో కనిపించిందన్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!