Rythu Bandhu : రేపటి నుంచి పదో విడత రైతు బంధు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకం కొనసాగుతోంది. అయితే.. తాజాగా పదో విడత రైతుబంధు నిధులు విడుదలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మంగళవారం ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60కోట్ల వ్యయంతో కోహిర్లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు.
Also Read : Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
రూ.150కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలోనే తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా టాప్లో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో తెలంగాణలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నన్ని పతకాలు ఎక్కడా లేవని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కోహీర్లో రూ.50కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే డయాలసిస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి గోదావరి జలాలను గోదావరికి తీసుకువస్తామన్నారు.
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!