Russia Ukraine War: చస్తే చస్తాం మళ్లీ తిరిగిరాం.. స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా సైనిక దాడి తర్వాత ఉక్రెయిన్ నుంచి ఫిబ్రవరిలో సుమారు 1500మంది భారతీయ వైద్యవిద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చారు. యుద్ధం కొనసాగుతుంది అందులో ప్రమాదం ఉన్నప్పటికీ మళ్లీ యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ దేశానికి తిరిగి వచ్చారు. నెలల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ భారత్ ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోవడంతో విసుగు చెందిన వైద్య విద్యార్ధులు తమ చదువులను కొనసాగించేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరిగి ఉక్రెయిన్కు పయనమయ్యారు. ఇండియాకు వస్తే వైద్యపట్టాతోనే వస్తాం.. లేదంటే చావైనా.. రేవైనా ఉక్రెయిన్లోనే అని తెగేసి చెప్పారు. కాగా ఉక్రెయిన్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు దృష్ట్యా.. అక్కడ మిగిలి ఉన్న భారతీయులందరినీ దేశం విడచి వెంటనే వెళ్లిపోవాలని అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. తర్వాత భారతీయ వైద్య విద్యార్ధులందరూ అక్కడికి వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Read Also: EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ
Also Read
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ (NMCA), 2019 ప్రకారం ఎటువంటి నిబంధనలు లేనప్పుడు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలలో వసతి కల్పించలేమని సెప్టెంబర్లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటి సడలింపులు ఇవ్వడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్యా విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై కేంద్రం చేతులెత్తేయంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీ దగ్గర తన హాస్టల్ని చూపిస్తూ, రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్లు వినిపిస్తున్నాయని, స్టూడెంట్స్ అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో తమకు వేనే ఆప్షన్ లేదని ఉక్రెయిన్లోని వినిత్సియా మెడికల్ కాలేజీలో వైద్యనభ్యసిస్తున్న విద్యార్థి బీహార్లోని గయా జిల్లా నివాసి రవి కుమార్ తెలిపాడు.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క