Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా
Union Budget 2023: ఎన్నికల వేళ కేంద్రం కర్ణాటకకు భారీ నజరానాను ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం రూ.5,300 కోట్ల సాయం అందించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
పార్లమెంటులో తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మ సీతారామన్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని కరువు పీడిత మధ్య ప్రాంతాలలో, ఎగువ భద్ర ప్రాజెక్ట్ కోసం రూ.5,300 కోట్ల కేంద్ర సహాయం ఇవ్వబడుతుందని ప్రకటించారు. ఎగువ భద్ర ప్రాజెక్ట్లో తుంగా నది నుంచి భద్ర జలాశయానికి 17.40 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) నీటిని, భద్ర రిజర్వాయర్ నుంచి 29.90 టీఎంసీలను ఎగువ భద్ర ప్రాజెక్ట్లో వినియోగానికి ఎత్తివేయాలని భావిస్తున్నారు. ఎండిపోయిన ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి కీలకమైనది.
Also Read
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఒక ట్వీట్లో కృతజ్ఞతలు తెలుపుతూ.. రాష్ట్రంలో ప్రధానమైన ఎగువ ప్రాంతాల కోసం రూ.5,300 కోట్ల గ్రాంట్ను ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో భద్ర ప్రాజెక్టు ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో