Union Budget 2023: ఎలక్ట్రానిక్స్ చౌక.. బంగారం, సిగరెట్లు ప్రియం.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2023: 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.
చౌకగా లేదా ప్రియంగా మారిన ఉత్పత్తుల జాబితా..
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
కెమెరా లెన్స్ల కోసం సంవత్సరం కస్టమ్స్ సుంకం నుంచి ఉపశమనం
టీవీ విడిభాగాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించబడింది.
ప్లాటినంపై సుంకంతో సరిపోయేలా వెండిపై దిగుమతి సుంకం పెంచబడుతుంది.
మూలధన వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ప్రతిపాదించబడింది.
లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన యంత్రాలకు కస్టమ్స్ సుంకం మినహాయింపులు ప్రతిపాదించబడ్డాయి.
రొయ్యల మేత ఇన్పుట్లపై కస్టమ్స్ సుంకం తగ్గించబడింది.
సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది. దీంతో సిగరెట్ల ధరలు పెరగనున్నాయి.
దేశంలో తదుపరి లోక్సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరగనున్నందున ఈ ఏడాది బడ్జెట్కు చాలా ప్రాముఖ్యత ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) వార్షిక బడ్జెట్ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10న ప్రారంభమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని ప్రకటించింది.


తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!