HCA: హైదరాబాద్ క్రికెట్ జట్టుకు రూ.25 లక్షల ప్రైజ్ మనీ..
- బుచ్చిబాబు టోర్నమెంట్ లో గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సీఏ ఆధ్వర్యంలో సన్మానం
- చెన్నై వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన హైదరాబాద్ టీమ్
- హైదరాబాద్ టీమ్ కి రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఛాంపియన్గా అవతరించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్మోహన్ రావు భారీ నజరానా ప్రకటించారు. ఏడేళ్ల తర్వాత టైటిల్ సాధించిన ఆటగాళ్లకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్మోహన్ రావు ప్రకటించారు.
Read Also: CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
గత రంజీ సీజన్లో ప్లేట్ డివిజన్లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్.. బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ ఇతర జట్లను చిత్తుగా ఓడించింది. ఈ సందర్భంగా.. జగన్మోహన్ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందన్నారు. గత సీజన్లో రంజీ ప్లేట్ ఛాంపియన్గా నిలిచాం.. ఈ సీజన్లో రంజీ ఎలైట్ ఛాంపియన్గా నిలువాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో.. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్సీఏ అందించేందుకు సిద్ధంగా ఉందని జగన్మోహన్ తెలిపారు.
శుక్రవారం(సెప్టెంబర్ 13) ఉప్పల్ స్టేడియం వేదికగా హెచ్సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా.. హైదరాబాద్ టీమ్, కోచ్ చటర్జీని హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కాగా.. ఫైనల్లో ఛత్తీస్ఘడ్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. 243 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 236 పరుగుల ఆధిక్యం సాధించగా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆట తీరు కనబరిచింది.
🏆 ₹25 Lakh Prize Money to the Champions!🏆
It was an honor to felicitate the Hyderabad Cricket Team today at RGICS, Uppal, after their thrilling victory in the All India Buchi Babu Tournament!🎉
I am pleased to announce a prize money of ₹25 lakh to celebrate their… pic.twitter.com/4zBy5FJVTs
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) September 13, 2024
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!