Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతేడాది మాదిరే ఈ సారి కూడా దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనన్ అందించనుంది. రూ.296 కోట్లు కార్మికులకు బోనస్గా అందజేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ.76,500 బోనస్ అందించనున్నారు. ఈ నగదు అక్టోబర్ 21న వారి ఖాతాల్లో జమ కానుంది.
Read Also: Girl Kisses Cheetah: చిరుతతో యువతి ముద్దులాట.. ఎంతో ఘాటు ప్రేమయో..!
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం(రూ.368 కోట్లు) వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా , దీపావళి బోనస్ల చెల్లింపునకు సింగరేణి రూ.664 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున రూ. లక్షా 60 వేల వరకూ రానున్నాయని సింగరేణి యాజమాన్యం తెలిపింది. దీనికి సంబందించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.
Read Also: Premi Vishwanath: వెండితెరపై వంటలక్క.. ‘కార్తీక దీపం’ మళ్లీ మునిగినట్టే..
మొత్తం సింగరేణి కార్మికులు 43,895 మంది ఉండగా.. అందరికి దీపావళి బోనస్ కింద రూ.72,500 ఇస్తారు. గరిష్టంగా రూ.76,500 పొందే అవకాశముంది. ఇందుకు సింగరేణి సంస్థ బడ్జెట్ సిద్ధం చేసింది. ఆ డబ్బులను ఈ నెల 21న కార్మికుల ఖాతాల్లో జమయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాన్ని ఆదేశించింది. బొగ్గు కార్మికుల కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సింగరేణి సీఎండీ సూచించారు. అందరూ కష్టపడి పనిచేస్తే.. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని అన్నారు. ఈ ఏడాది సైతం 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి కార్మికులకు సింగరేణి సీఎండీ శ్రీధర్ సూచించారు.
తాజావార్తలు
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి