Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni: తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతేడాది మాదిరే ఈ సారి కూడా దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనన్ అందించనుంది. రూ.296 కోట్లు కార్మికులకు బోనస్గా అందజేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ.76,500 బోనస్ అందించనున్నారు. ఈ నగదు అక్టోబర్ 21న వారి ఖాతాల్లో జమ కానుంది.
Read Also: Girl Kisses Cheetah: చిరుతతో యువతి ముద్దులాట.. ఎంతో ఘాటు ప్రేమయో..!
Also Read
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం(రూ.368 కోట్లు) వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా , దీపావళి బోనస్ల చెల్లింపునకు సింగరేణి రూ.664 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున రూ. లక్షా 60 వేల వరకూ రానున్నాయని సింగరేణి యాజమాన్యం తెలిపింది. దీనికి సంబందించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.
Read Also: Premi Vishwanath: వెండితెరపై వంటలక్క.. ‘కార్తీక దీపం’ మళ్లీ మునిగినట్టే..
మొత్తం సింగరేణి కార్మికులు 43,895 మంది ఉండగా.. అందరికి దీపావళి బోనస్ కింద రూ.72,500 ఇస్తారు. గరిష్టంగా రూ.76,500 పొందే అవకాశముంది. ఇందుకు సింగరేణి సంస్థ బడ్జెట్ సిద్ధం చేసింది. ఆ డబ్బులను ఈ నెల 21న కార్మికుల ఖాతాల్లో జమయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాన్ని ఆదేశించింది. బొగ్గు కార్మికుల కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సింగరేణి సీఎండీ సూచించారు. అందరూ కష్టపడి పనిచేస్తే.. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని అన్నారు. ఈ ఏడాది సైతం 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి కార్మికులకు సింగరేణి సీఎండీ శ్రీధర్ సూచించారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?